Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర నవంబర్ 28 నుంచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదవ దశ ప్రజా సంగ్రామయాత్ర నవంబర్ 28 న ప్రారంభం కానుంది. నిర్మల్ జిల్లా నుంచి అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఐదవ దశ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కరీంనగర్లో ముగింపు సభ జరగనుంది. డిసెంబర్ మధ్య వరకు పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఇప్పటికే బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర నాలుగు దశలను ముగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా ఆయన ఇప్పటి వరకు నడిచారని, 21 జిల్లాల్లోని 13 లోక్సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,178 కిలోమీటర్ల మేర నడిచారని బీజేపీ ప్రకటనలో పేర్కొంది.
Also Read :Tiktalks With Taruna : చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపితో ‘టిక్టాక్స్ విత్ తరుణ’
మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడంపై బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై నవంబర్ 19న బీఎల్ సంతోష్కు తెలంగాణ పోలీసులు సమన్లుజారీ చేశారు.
Also Read
- Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
Also Read : Moinabad Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు
కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాక్కోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు అక్టోబర్ 26న రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్, సింహయాజి స్వామిని రంగారెడ్డిలోని ఒక ఫామ్హౌస్లో అరెస్టు చేశారు. బీజేపీ చేస్తున్న దోపిడీ ప్రయత్నాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ, 2018 నుంచి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను డబ్బు ఆశచూపి కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ హత్య చేసిందని కేసీఆర్పై మండిపడ్డారు. “ఎమ్మెల్యేలను భయపెట్టి, నియోజకవర్గంలో కొన్ని కాంట్రాక్టులు ఇప్పిస్తానని, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. అదే విధంగా 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కేసీఆర్ ఏది చెప్పినా అది ఆయనకు అనుకూలమే తప్ప ఇతరులకు కాదు’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..