Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర నవంబర్ 28 నుంచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదవ దశ ప్రజా సంగ్రామయాత్ర నవంబర్ 28 న ప్రారంభం కానుంది. నిర్మల్ జిల్లా నుంచి అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఐదవ దశ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కరీంనగర్లో ముగింపు సభ జరగనుంది. డిసెంబర్ మధ్య వరకు పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఇప్పటికే బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర నాలుగు దశలను ముగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా ఆయన ఇప్పటి వరకు నడిచారని, 21 జిల్లాల్లోని 13 లోక్సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,178 కిలోమీటర్ల మేర నడిచారని బీజేపీ ప్రకటనలో పేర్కొంది.
Also Read :Tiktalks With Taruna : చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపితో ‘టిక్టాక్స్ విత్ తరుణ’
మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడంపై బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై నవంబర్ 19న బీఎల్ సంతోష్కు తెలంగాణ పోలీసులు సమన్లుజారీ చేశారు.
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
Also Read : Moinabad Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు
కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాక్కోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు అక్టోబర్ 26న రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్, సింహయాజి స్వామిని రంగారెడ్డిలోని ఒక ఫామ్హౌస్లో అరెస్టు చేశారు. బీజేపీ చేస్తున్న దోపిడీ ప్రయత్నాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ, 2018 నుంచి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను డబ్బు ఆశచూపి కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ హత్య చేసిందని కేసీఆర్పై మండిపడ్డారు. “ఎమ్మెల్యేలను భయపెట్టి, నియోజకవర్గంలో కొన్ని కాంట్రాక్టులు ఇప్పిస్తానని, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. అదే విధంగా 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కేసీఆర్ ఏది చెప్పినా అది ఆయనకు అనుకూలమే తప్ప ఇతరులకు కాదు’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!