Bandi Sanjay : జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు 90 శాతం నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది
- జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించడం ఆశ్చర్యంగా ఉంది
- గ్రామాల్లో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు 90 శాతం నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ 26న అన్ని గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు… ఇవాళ ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు 90 శాతం నిధులిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే. గ్రామాల్లోని మొక్కల పెంపకం, రైతు వేదికలు, వైకుంఠధామాలు, రోడ్ల నిర్మాణం వంటివన్నీ కేంద్రం ఇస్తోన్న ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్నవే. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవి తమవిగా చెప్పుకుంటూ ఏడాది పాలనా విజయోత్సవాల పేరుతో ఉపాధి పనుల ప్రారంభించాలని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. సొమ్ము కేంద్రానిదైతే… సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేక కేంద్రం నిధులతో అమలవుతున్న ఉపాధి పనులను విజయోత్సవాలుగా ప్రారంభించుకోవడం సిగ్గు చేటని అన్నారు.
I.N.D.I.A Alliance: మహారాష్ట్ర ఓటమితో అలిగిన టీఎంసీ.. ఆ బాధ్యత మమతా బెనర్జీకి ఇవ్వాలని డిమాండ్
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
అంతేకాకుండా..’నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కూలీలకు సమున్నత లబ్ది చేకూరుతోంది. యూపీఏ హయాంలో గ్రామీణ పేదలకు ఉపాధి దూరమైతే.. ఎన్డీఏ పాలనలో కోట్లాది మందికి వరంగా మారింది. గత పదేళ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్క తెలంగాణలోనే దాదాపు రూ.30 వేల కోట్ల మేరకు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. ఇంత గొప్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేలా గొప్పగా ప్రకటనలు చేసుకోవడం సిగ్గుచేటు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ప్రదర్శించాలి. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నింటికీ ప్రధానమంత్రి ఫొటో తప్పనిసరిగా ఉండేలా సర్క్యులర్ జారీ చేయాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజాక్షేత్రంలో అడుగడుగునా ఎండగడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం…’ అని ఆయన అన్నారు.
Minister Narayana: టౌన్ ప్లానింగ్లో సమూల మార్పులు.. సీఎం చేతికి కీలక రిపోర్ట్..
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!