Bandaru Dattatreya : ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న కైత్లాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా.. ’33 ఏళ్ళు సినీ రంగంలో ప్రఖ్యాతిగాంచారు. నీతికి, నిజాయితీకి మారు పేరు ఎన్టీఆర్. రాజకీయాల్లో సమయ పాలన ఉండదు. రాజకీయాల్లో క్రమ శిక్షణ తెచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అధికార వికేంద్రీకరణ చేశారు. పేదవాడికి ఇల్లు లక్ష్యంగా పని చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానప్పటి వరకు మదరాసీలు అనే వారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పారు. శత్రుత్వం పనికి రాదు, సరైంది కాదు. రాజకీయాల్లో శత్రుత్వం రూపుమాపి స్నేహపూర్వక రాజకీయాలు చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..
Also Read
అనంతరం ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి మాట్లాడుతూ.. ‘భావి తరాలకు ఎన్టీఆర్ ఔచిత్యం గురించి తెలియజేయాల్సిన భాద్యత అందరిపై ఉంది. ఏఎన్నార్ ను మేము బాబాయ్ అనే వాళ్ళం. ఏఎన్నార్ కు పిల్ల నివ్వడానికి కూడా వెనుకడుగు వేసే వారని ఏఎన్నార్ చాలా సార్లు చెప్పే వారు. నటి, నటులకు ఎంతో గుర్తింపు తెచ్చిన వ్యక్తులు ఎన్టీఆర్, ఏఎన్నార్. పదవి అలంకార ప్రాయం కాదు.. ప్రజలకు సేవడానికే అని నిరూపించారు ఎన్టీఆర్. పాలకుడు ప్రజలకు నచ్చిన పనులు చేయాలి తనకు నచ్చిన పనులు చేయడం కాదని ఎన్టీఆర్ నిరూపించారు. అన్నా.. ఇంత చేసిన నీకు సభలు, సమావేశాలు నిర్బహించాలా అని అనిపిస్తుంది. శత తరాలకు ఎన్టీఆర్ గురించి తెలియాలి.’ అని అన్నారు.
Also Read : వెల్లుల్లితో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!