Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. మొత్తం 224 స్థానాల్లో 135 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం 66, జేడీయూ 19 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ రోజు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో బీజేపీయేతర ప్రతిపక్ష నేతల సమక్షంలో సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం జరిగింది.
Read Also: IPL 2023: లక్నోను ఆదుకున్న పూరన్.. కేకేఆర్ ఎదుట భారీ టార్గెట్
Also Read
ఇదిలా ఉంటే చారిత్రాత్మక విజయం సాధించిన కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని ఆమె అన్నారు. వీడియో ప్రసంగంలో ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల అనుకూల, పేదల అనుకూల ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, ఈ తీర్పు ద్వారా ప్రజలు అవినీతిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత ఆమె తన సందేశాన్ని ఇచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, ప్రజలకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలను తొలి కాబినెట్ సమావేశంలో ఇప్పటికే ఆమోదం తెలిపినందుకు గర్విస్తున్నట్లు, కర్ణాటక శ్రేయస్సు, శాంతి, ప్రగతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
#WATCH | Former Congress president Sonia Gandhi thanked the people of Karnataka for electing Congress in the recently concluded assembly elections and assured them that the newly-formed govt will work on the path of development of the state. pic.twitter.com/cvqr76fyFz
— ANI (@ANI) May 20, 2023
తాజావార్తలు
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!