Balka Suman : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే స్వయంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు బాల్క సుమన్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజాదరణ పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద 48 గంటలు ఈసీ నిషేధించడం బిజెపి పార్టీ కుట్రలో భాగం మాత్రమేనన్నారు. రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు బాల్క సుమన్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సూచించిన బలహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిపిందన్నారు. ఆర్.ఆర్ టాక్సీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకాన్ని దోపిడీకి గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Ajith Fan Arrested: విజయ్ సినిమా బ్యానర్ చింపిన అజిత్ ఫ్యాన్ అరెస్ట్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అంతేకాకుండా..’సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బిజెపి పార్టీ దేశ యువతను మోసం చేసింది. బీజేపీ ప్రభుత్వం దేశంలో కులాలు, మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించి పాలిస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల ఎజెండాలో మతం, రిజర్వేషన్ల మీద ఓట్లను సెట్ చేసుకునే స్థాయికి దిగజారాయి. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారడం తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో ఏలాంటి అవకతవకలు జరగకుండా పేద ప్రజలకు ఇసుకను అందించాo. కేవలం డబ్బుల కోసమే బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇసుక పాలసీని రద్దుచేసి కొత్త జీవోలు తీసుకువచ్చి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మే 4 తారీకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కెసిఆర్ రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు..’ అని బాల్క సుమన్ అన్నారు.
Brij Bhushan: లైంగిక ఆరోపణల్లో ఇరుక్కున్న బ్రిజ్ భూషన్కి బీజేపీ షాక్.. కొడుకుకి టికెట్..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!