U19 World Cup: సీనియర్ల బాటలో జూనియర్లు.. ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్లు వరల్డ్ కప్ను చేజార్చారు. ఇప్పుడు జూనియర్లు అదే పని చేశారు. జూనియర్లు అయినా.. వరల్డ్ కప్ గెలిచి ప్రతికారం తీర్చుకుందామనుకుంటే.. వీళ్లు కూడా మేము కూడా మీ వెంటనే ఉంటామన్నంటూ కప్ గెలవలేకపోయారు. ఫైనల్ వరకు వచ్చి టైటిల్ ను మిస్సయ్యారు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. 254 పరుగుల లక్ష్యచేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు నాలుగోసారి ఛాంపియన్గా నిలిచింది. గతంలో 1988, 2002, 2010లో ట్రోఫీని గెలుచుకుంది. అండర్-19 ప్రపంచకప్లో భారత్ తర్వాత అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. భారత్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది.
Read Also: Damodara Raja Narasimha : దసరా నాటికి కంకోల్ పీహెచ్సీ ప్రారంభం
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఆటగాళ్లు తడబడ్డారు. సెమీఫైనల్ మ్యాచ్ లాగానే టైటిల్ మ్యాచ్ లోనూ భారత్ టాప్ ఆర్డర్లు నిరాశపరిచారు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 3 పరుగులకే ఔట్ కాగా.. మంచి ఫామ్లో ఉన్న ముషీర్ ఖాన్ 22 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. మరోవైపు.. కెప్టెన్ ఉదయ్ సహారన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సెమీఫైనల్లో లాగా ఫైనల్ లో ఆదుకుంటాడనుకున్న సచిన్ దాస్ కూడా.. 9 పరుగులు మాత్రమే చేశాడు. ప్రియాంషు మోలియా 9, వికెట్ కీపర్ అవినాష్ డకౌట్ అయ్యాడు. కాస్తో కూస్తో.. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 47, మురుగన్ అభిషేక్ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3, రాఫ్ మెక్ మిలన్ 3, కల్లమ్ విల్డర్ 2, చార్లీ ఆండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ డిక్సన్ 42 పరుగులు, వీబ్జెన్ 48, హర్జస్ సింగ్ 55, పీక్ 46 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో రాజ్ లింబానీ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తివారీ 2 వికెట్లు పడగొట్టగా.. ముషీర్, సామీ పాండే తలో వికెట్ తీశారు.
Read Also: Agra: భార్య గుడికి.. తల్లి, కొడుకును హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారవేత్త..
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!