Agra: ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
ఒక బిజినెస్ డీల్లో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్నానని, అప్పులు చేశానని వ్యాపారవేత్త తరుణ్ చెబుతున్న వీడియో అతని మొబైల్ ఫోన్లో పోలీసులకు లభించింది. ఈ వీడియో ఆధారంగా తరుణ్ హత్యలు చేసి, ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాను తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానని తెలుసని, అయితే తాను చేయగలిగింది ఏమీ లేదని వీడియోలో పేర్కొన్నాడు.
Read Also: Pushkar Singh Dhami: పోలీసులు సజీవ దహనానికి ప్రయత్నించారు.. వారిని వదిలిపెట్టేది లేదు..
హత్యల సమయంలో తరుణ్ భార్య రజనీ ఖాతు శ్యామ్ స్థానిక ఆలయంలో దేవుడి దర్శనానికి వెల్లింది. 15 ఏళ్ల క్రితం తరుణ్తో రజనీ వివాహం జరిగింది. డీసీపీ ఆగ్రా సూరజ్ కుమార్ మాట్లాడుతూ.. తరుణ్ మృతదేహం మొదటి అంతస్తులో ఉరేసుకున్న స్థితిలో లభించిందని, అతని తల్లి బ్రజేష్ దేవీ, 12 అతని కొడుకు 12 ఏళ్ల కుశాగ్రా గ్రౌండ్ ఫ్లోర్లో విగతజీవులుగా పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిద్దరిపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. వాంతులు, గోళ్ల రంగు నీలి కలర్లోకి మారాయి. తరుణ్ భార్యను కూడా చంపాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రజనీ అతని కోడలు గుంజన్తో కలిసి ఆలయానికి వెళ్లడంతో బతికిపోయింది. ఉదయం ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషి ముందుగా ఈ దారుణాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. తరుణ్ తండ్రి కొన్ని నెలల క్రితమే చనిపోయాడని డీసీపీ తెలిపారు.