Social Media Ban: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం.. పిల్లల ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
- 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం
- పిల్లల ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
- ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వాడకం కామన్ అయిపోయింది. సామాజిక మాద్యమాల్లో గంటలు గంటలు గడుపుతున్న వారి సంఖ్య ఎక్కువై పోతోంది. దీని వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలు దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇంటర్నెట్ మీడియాను పూర్తిగా నిషేధించింది ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి టిక్టాక్ , ఆల్ఫాబెట్ ఇంక్, యూట్యూబ్, మెటా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్తో సహా అనేక ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేయకుండా పిల్లలకు నిషేదం విధించారు.
Also Read:Jasprit Bumrah: 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా.. జస్ప్రీత్ బుమ్రా నయా రికార్డు
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
కొత్త చట్టం ప్రకారం, పది అతిపెద్ద ప్లాట్ఫామ్లు పిల్లలను బ్లాక్ చేయాలని లేదా $33 మిలియన్ల వరకు జరిమానా విధిస్తామని ఆదేశించింది. ఈ చట్టాన్ని ప్రధాన టెక్నాలజీ కంపెనీలు, వాక్ స్వాతంత్య్ర న్యాయవాదులు విమర్శించారు, కానీ తల్లిదండ్రులు, పిల్లల హక్కుల న్యాయవాదులు దీనిని స్వాగతించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు ఇంటర్నెట్ మీడియాపై నిషేధం విధించడం వల్ల పిల్లలకు వారి బాల్యం లభిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు. ఇంటర్నెట్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర, స్థానిక నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతిని అందించడానికి, ఆస్ట్రేలియన్ పిల్లలకు సురక్షితమైన బాల్యం ఉండేలా చూసుకోవడానికి ఆస్ట్రేలియాకు అవసరమైన సాంస్కృతిక మార్పు ఇదేనని ఆయన అన్నారు.
రాబోయే పాఠశాల సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిల్లలను కోరారు. వారి ఫోన్లలో సమయం గడపడానికి బదులుగా, కొత్త క్రీడలను నేర్చుకోవాలని, కొత్త వాయిద్యం, పుస్తకాన్ని చదవండి. ముఖ్యంగా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడపండి అని సూచించారు. ఈ ఆంక్షల వల్ల టీనేజర్లు ఎక్కువగా ప్రభావితమవుతారు. వారి కనెక్షన్ పూర్తిగా ఇంటర్నెట్ మీడియాపై ఆధారపడి ఉంటుంది. సెలవుల్లో తమ సుదూర స్నేహితులతో ఎలా కనెక్ట్ అవ్వాలో అని ఆందోళన చెందుతున్నారు.
Also Read:మినీ థియేటర్ మీ ఇంట్లోనే.. తక్కువ బడ్జెట్లో Onida’s Nexg 55UZI 4K Ultra HD Google TV
సిడ్నీకి చెందిన 15 ఏళ్ల నోహ్ జోన్స్, మైసీ నేలాండ్ కోర్టులో చట్టాన్ని సవాలు చేశారు. ఈ నియమం దేశంలోని సుమారు 2.6 మిలియన్ల మంది యువకుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని వాదిస్తున్నారు. అయితే, ఇంటర్నెట్ మీడియా హానికరమైన ప్రభావాల నుండి పిల్లలను రక్షించడానికి చాలా మంది తల్లిదండ్రులు ఈ చర్యకు మద్దతు ఇస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!