Atchennaidu: బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదు.. అలీబాబా 40 దొంగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ మహానాడు వేదికపై వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ చేపడుతున్న బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. అలీబాబా 40 దొంగలు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులను ప్రజలు నిలదీయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం అని తెలిపారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన, చట్టబద్దమైన అధికారాలు కల్పిస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలపై తప్పుడు కేసులను ఒక్క సంతకంతో ఎత్తేస్తామన్నారు.
Minister Jayaram: టీడీపీకి ఇదే చివరి మహానాడు
Also Read
చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు శపథం చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల కోసమే టీడీపీ రాజకీయం చేస్తుందని వివరించారు. గత మూడేళ్లుగా చంద్రబాబు మొదలుకుని సాధారణ కార్యకర్త వరకు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. వైసీపీలాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదన్నారు. టీడీపీ ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ అని అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. టీడీపీని లేకుండా చేయడం జగన్ వాళ్ల తాత, తండ్రి వల్ల కూడా కాలేదన్నారు. రోడ్డెక్కడానికి భయపడే పరిస్థితి నుంచి రోడ్డెక్కి పోరాటం చేసే స్థితికి కార్యకర్తలు చేరారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి రాగానే ప్రభుత్వం షేక్ అయ్యిందన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన లభించిందన్నారు. ఉత్తరాంధ్రలోనే కాదు.. చంద్రబాబు కడప వెళ్తే అక్కడ జిల్లానే దద్దరిల్లిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
-
LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!