Minister Jayaram: టీడీపీకి ఇదే చివరి మహానాడు
ఒంగోలులో టీడీపీ మహానాడు భారీస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఆయనకు మతి భ్రమించిందని ఎన్టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. వరుణ దేవుడి ఆశీస్సులు రాజశేఖర్ కుటుంబానికి ఉంటాయని చెప్పటానికి కురుస్తున్న వర్షాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి జయరాం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
చరిత్రలో ఇంత వరకు ఎవరూ బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. లోకేష్ ముద్దపప్పు అని.. టీడీపీకి ఇదే చివరి మహానాడు అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని మంత్రి గుమ్మనూరు జయరాం ఆరోపించారు. వందకు వెయ్యి శాతం మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
Chandra Babu: కేంద్రం మెడలు వంచుతామని.. వీళ్లే మెడలు దించేశారు
మరోవైపు శెట్టి బలిజలను కించ పరుస్తూ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తోందన్నారు. ఏ వర్గాన్ని అయినా ఇలా కించ పరచటం కరెక్ట్ కాదని సూచించారు. జూపుడి ప్రభాకర్ వ్యాఖ్యల వల్ల మనోభావాలు దెబ్బతిన్న శెట్టి బలిజలకు తన తరపున క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో