Asian Athletics Championships 2025: ముగిసిన ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2024.. 24 పతకాలతో భారత్..!
- ముగిసిన ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2024.
- 8 బంగారు, 10 రజత, 6 కాంస్య పతకాలతో రెండవ స్థానంలో భారత్.
- 32 పతకాలతో అగ్రస్థానంలో చైనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Athletics Championships 2025: 26వ ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత్ 24 పతకాలతో విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించింది. చివరి రోజున బంగారు పతకాలు రాకపోయినా, భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మెరిశారు. ఇందులో మహిళల 5000 మీటర్ల పరుగు పోటీలో పరుల్ చౌధరీ 15:15.33 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచి తన రెండవ రజతాన్ని గెలుచుకుంది. ఆమె ఇంతకు ముందు 3000మీటర్ల స్టీపుల్ చేజ్ లో కూడా రజతం గెలుచుకుంది.
Read Also: Russia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
Also Read
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
అలాగే మెరుగైన ప్రదర్శనతో జావెలిన్ త్రోలో సచిన్ యాదవ్ తన వ్యక్తిగత రికార్డ్ గా 85.16 మీటర్లను సాధించి రజతం గెలుచుకున్నాడు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 86.40 మీటర్లతో స్వర్ణం గెలిచాడు. ఇదే పోటీలో యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత ఉత్తమమైన త్రోగా 82.57 మీటర్లతో ఐదవ స్థానంలో నిలిచాడు. మరోవైపు అబినయ రాజరాజన్, స్నేహా ఎస్ఎస్, శ్రబణి నందా, నిత్యా గంధేతో కూడిన రిలే బృందం 43.86 సెకన్లతో సీజన్ బెస్ట్ టైం నమోదు చేసి భారత్ కు రజత పతకాన్ని అందించింది.
ఇంకా చూస్తే ఒడిశాకు చెందిన 21 ఏళ్ల అనిమేష్ కుజుర్ 200మీటర్ల రేసులో 20.32 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పి కాంస్య పతకం గెలిచాడు. ఇది 2015 తర్వాత ఈ విభాగంలో భారత్ కు వచ్చిన మొదటి పతకం. అతని ముందు జపాన్కు చెందిన టోవా ఉజావా (20.12 సెకన్లు) స్వర్ణం గెలిచాడు. అలాగే 400మీ. హర్డిల్స్ లో తమిళనాడుకు చెందిన విథ్య రామరాజ్ 56.46 సెకన్ల టైంతో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకుంది. మరో అథ్లెట్ అనూ రాఘవన్ 57.46 సెకన్లతో ఏడవ స్థానంలో నిలిచింది. ఇంకో ఈవెంట్ మహిళల 800మీటర్ల రేసులో పూజా తన వ్యక్తిగత ఉత్తమ టైమ్ 2:01.89 సెకన్లతో కాంస్య పతకాన్ని సాధించింది.
Read Also: Hyderabad: సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..!
ఇక మొత్తంగా భారత బృందం మొత్తం 8 బంగారు, 10 రజత, 6 కాంస్య పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది 27 పతకాలతో ముగించిన భారత్ ఈసారి మాత్రం 24 పతకాలతో ముగించింది. అయితే, ఈసారి బంగారు పతకాల సంఖ్యలో (6 నుండి 8కి) మెరుగుదల సాధించింది. చైనా మొత్తం 32 పతకాలతో (19 బంగారు) అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్తో బెంగళూరుకు!
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!