Hyderabad: సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..!
- సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
- నిందితులు స్నేహితులేనని చెప్పిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సూరారంలో యువకుడి మర్డర్ను కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు స్నేహితులేనని పోలీసులు తెలిపారు.
ఈ నెల 30న సూరారం బతుకమ్మ కుంట దగ్గర యువకుడి మృతదేహం లభ్యం అయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో చెరువు కట్ట దగ్గర కారు నిలిపి ఉండటాన్ని పోలీసులు గమినించారు. రక్తపు మడుగులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. ఇక కారు నెంబర్ ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి డానిష్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
వివరాల్లోకి వెళ్తే..
జగద్గిరిగుట్ట పరిధి శ్రీనివాస్నగర్కు చెందిన మహ్మద్ బిలాల్ (32) అదే ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న ముగ్గురు పిల్లల తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బోరబండలో నివాసం ఉంటున్న ఆమె కొడుకు సయ్యద్ డానిష్కు విషయం తెలిసి బిలాల్తో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. అయినా కూడా వివాహేతర సంబంధం కొనసాగించడంతో చంపేయాలని కక్ష పెంచుకున్నాడు. గురువారం క్యాబ్లో డానిష్ జగద్గిరిగుట్టకు వచ్చాడు. బిలాల్, అతని స్నేహితుడు అస్లామ్(28)ను మద్యం తాగుదామని గాజులరామారంలోని చింతల్ చెరువు దగ్గరకు వెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం గొడవకు దిగారు. ఇదే అదునుగా డానిష్ వెంట తెచ్చుకున్న కత్తితో బిలాల్పై దాడి చేశాడు. వెంటనే బిలాల్, అస్లామ్ తేరుకుని.. డానిష్ చేతిలోంచి కత్తి లాక్కుకుని.. అదే కత్తితో డానిష్పై దాడి చేయగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం నిందితులిద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు.
హత్యకు ఉపయోగించిన కత్తిని, రక్తపు బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. తల్లితో వివాహేతర సంబంధం మానుకోలేదని హత్య చేయాలనుకుంటే… అతడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..