IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే.. ఏ జట్టుకు బెనిఫిట్?
- మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్
- ఒకవేళ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే
- ఒక్క మ్యాచ్ ఓడినా లంక ఇంటికే
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో పాక్ను ఓడించిన భారత్.. మరోసారి జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఒకవేళ అనివార్య కారణాల చేత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
దుబాయ్లో ఈరోజు సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ సమయంలో గంటకు 13 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గల్ఫ్ దేశమైన యుఎఇలో వర్షం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం లేదు. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం దాదాపుగా లేదు. ప్రస్తుతానికి అక్కడ మంచి వాతావరణం ఉంది. అయితే వర్షం లేదా మరేదైనా కారణం చేత మ్యాచ్ రద్దు చేయబడితే. రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. ఇప్పటివరకు ఆసియా కప్ 2025లో ఒక్క మ్యాచ్ కూడా రద్దు కాలేదు. వర్షం ఎలాంటి ఆటకం కలిగించలేదు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Also Read: IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్.. శుభ్మన్ గిల్కు అభిషేక్ శర్మ సూచనలు!
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగుతుంది. ఓ టీమ్ మిగతా మూడు జట్లతో ఒకసారి తలపడుతుంది. సూపర్-4 ముగిసేసరికి అగ్ర స్థానంలో ఉన్న రెండు జట్లు ఫైనల్కు చేరుకుంటాయి.మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు, రద్దైతే ఒక పాయింట్ దక్కుతుంది. ఈ మ్యాచ్ రద్దైతే భారత్, పాకిస్తాన్ జట్లకు లాభించనుంది. సూపర్-4లో శ్రీలంక ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడింది. భారత్, పాకిస్తాన్ జట్లతో లంక ఆడాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా.. లంక ఇంటికి పోవాల్సిందే. ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లా కూడా భారత్, పాకిస్తాన్ జట్లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచులలో బంగ్లా ఒక్కటి ఓడినా అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు భారత్, పాకిస్తాన్ రెండు మ్యాచులు గెలిస్తే ఫైనల్ చేరుకునే ఆవకాశాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!