PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- పీఓకే ప్రజలకు ఆహారం, మందులు అండకుండా చేస్తున్న పాకిస్తాన్..
- పీఓకేను దిగ్బంధించి, నిరసనల్ని అణచివేయాలనే ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK: పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్ శరణార్థులకు 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించడంపై అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తారు. ఈ నిర్ణయం ద్వారా పాక్ ప్రభుత్వం తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి.
ఇదిలా ఉంటే, ఈ ఆందోళనల్ని అడ్డుకోవడానికి, ఉద్యమకారుల్ని అణచివేయడానికి పాకిస్తాన్ అనాగరిక చర్యలకు దిగుతోంది. పాక్ ఇతర ప్రాంతాల నుంచి పీఓకేకు సరకులు వెళ్లకుండా దిగ్బంధనం చేసింది. దీంతో ఆహారం, మందుల కోసం పీఓకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నిరసనల నేపథ్యంలో పీఓకేలోని ముజఫరాబాద్, రావలాకోట్, బాగ్, నీలం వ్యాలీ ప్రాంతాల్లో ఆహారం, మందులు, ఇంధనం కొరత తీవ్రంగా పెరిగింది. అనేక దుకాణాలు, మెడికల్ షాపులు మూతపడగా, ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిండి, బియ్యం, పప్పులు, పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువులు కూడా దొరకడం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
పాకిస్తాన్ నుంచి వస్తున్న సరుకుల్ని పీఓకేకు చేరకముందే చెక్పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది ట్రక్ డ్రైవర్లు ఆహార పదార్థాలు, నిత్యావసరాలతో వెళ్లున్న వాహనాలను నిలిపేస్తున్నారు. దీంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయితే, ఈ ఆరోపణల్ని పాక్ అధికారులు ఖండిస్తున్నారు. అవసరమైన వస్తువుల రవాణాను అడ్డుకోవడం లేదని చెప్పారు. మరోవైపు, ఉద్యమం రోజురోజుకు బలపడుతోంది. రావల్ కోట్లో భారీ ధర్నాకు 70,000 మంది హాజరయ్యారు. అవసరమైతే లక్ష మందితో ముజఫరాబాద్కు మార్చ్ చేపడుతామని ఉద్యమ నేతలు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!