Asia Cup 2025: కౌంట్ డౌన్ స్టార్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్
- మధ్యాహ్నం 1.30కు జట్టు ప్రకటన
- జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025 Live Streaming on Star Sports and JioCinema: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనుంది. భారత క్రికెట్ జట్టులో ఎవరుంటారో అనే నిరీక్షణకు నేడు తెరపడనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు మధ్యాహ్నం 1.30కు జట్టును ప్రకటించనున్నారు. జట్టు ఎంపిక కోసం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలెక్టర్ల సమావేశం జరుగుతుంది. బీసీసీఐ సమావేశం తర్వాత చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో హాట్స్టార్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం మంగళవారం భారత మహిళా క్రికెట్ జట్టును కూడా ప్రకటిస్తారు. ఇదే జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్లో ఆడనుంది. రెండు మేజర్ టోర్నీలకు బీసీసీఐ ఈరోజు టీమ్స్ ప్రకటించనున్నా నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళల జట్టుపై కాస్త క్లారిటీ ఉన్నా.. పురుషుల జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. దాంతో జట్టులో ఎవరుంటారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
Also Read
- Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’... సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
Also Read: Gold Rate Today: శుభవార్త.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు! నేటి గోల్డ్ రేట్స్ ఇవే
కొన్ని సంవత్సరాలుగా భారత జట్టులో మూడు ఫార్మాట్లలో వేర్వేరు ఆటగాళ్లు ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్కు కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ శర్మ వన్డే సారథిగా ఉండగా.. శుభ్మాన్ గిల్ టెస్ట్ కెప్టెన్గా ఉన్నాడు. గిల్ నాయకత్వంలో భారత జట్టు ఇటీవల ఇంగ్లండ్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్లో రాణించిన గిల్కు టీ20 జట్టులో చోటు లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గిల్ను టీ20 జట్టులోకి తీసుకోవాలా వద్దా అనేది చర్చనీయాంశంగా మారింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్లకు చోటు కష్టమే అని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’… సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!