Asaduddin Owaisi: ఇలా ఎఫ్ఐఆర్ చూడటం ఇదే తొలిసారి.. తనపై నమోదైన కేసుపై ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, వివాదాస్పద సాధువు యతి నరసింహానందపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలను చూసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీసుల గురించి అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. తనపై నమోదైన కేసు ఏమిటో తెలపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎఫ్ఐఆర్ ను చూడటం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి నేను భయపడనని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాన్ని విమర్శించడాన్ని, విద్వేషపూరిత వ్యాఖ్యలుగా చూడలేమని ఆయన అన్నారు.
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వంటి వారిపై కేసులు కొనసాగించే ధైర్యం లేనట్లు కనిపిస్తోందని.. ఇందుకు పోలీసుల ఆలస్యంగా స్పందించమే కారణం ట్వీట్ చేశారు. ముస్లింలపై మారణహోమాన్ని ప్రోత్సహించడం, ఇస్లాంను కించపరచడం ద్వారా యతి నరసింహానంద బెయిల్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలకు అలవాటు పడ్డారని.. అంతర్జాతీయ సమాజం ఖండించినప్పుడు మాత్రమే కోర్టులు, పోలీసులు నామమాత్రమైన చర్యలు తీసుకుంటున్నారని అసదుద్దీన్ ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు ‘ బ్యాలెన్సుడ్ వాద్’ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని.. హిందూ మతోన్మాదులను నొప్పించకుండా ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారంటూ విమర్శించారు. ఒక పక్క మహ్మద్ ప్రవక్తను అవమానిస్తూనే.. మరోవైపు బీజేపీ మద్దతుదారులను ఒప్పించేందుకు నాపై కేసు పెట్టారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. దీనికి విరుద్ధంగా, ముస్లిం విద్యార్థులు, జర్నలిస్టులు, కార్యకర్తలు కేవలం ముస్లిం అనే నేరానికి జైలులో పెట్టారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!