YS Sharmila: జమిలి ఎన్నికల బిల్లుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!
- జమిలి ఎన్నికల బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
- భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉంది
- బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీల గడువును లోక్సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
‘భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్సభలో ప్రవేశపెట్టింది. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం. ఇది ఫక్తు నియంతృత్వ చర్య .సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్సభలో ఓటింగ్తో తేలింది. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి?. ఇందులో ఏమన్నా అర్థముందా?, సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నించింది. చివరకు ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టింది’ అని వైఎస్ షర్మిల ఎక్స్లో పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
‘రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదు. జమిలి ఎన్నికలు జరపాలంటే.. కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాలవ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. అసెంబ్లీల గడువును లోక్సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదు. దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడమే బీజేపీ ఉద్దేశం. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు’ అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!