ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్గా కోన తాతారావు (జనసేన), కడప డీసీసీబీ ఛైర్మన్గా బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)లు నియమితులయ్యారు. శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్గా అవినాష్ ఛౌదరి (టీడీపీ), విశాఖ డీసీఎంఎస్ ఛైర్మన్గా కొట్ని బాలాజీ (టీడీపీ)లు నియమితులయ్యారు.
డీసీసీబీ ఛైర్మన్స్:
శ్రీకాకుళం – శివ్వల సూర్యనారాయణ (టీడీపీ)
విశాఖ – కోన తాతారావు (జనసేన)
కడప – బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)
విజయనగరం – కిమిడి నాగార్జున (టీడీపీ)
గుంటూరు – మక్కన మల్లికార్జునరావు (టీడీపీ)
కృష్ణా – నెట్టెం రఘురామ్ (టీడీపీ)
నెల్లూరు – ధనుంజయరెడ్డి (టీడీపీ)
చిత్తూరు – అమాస రాజశేఖర్ రెడ్డి (టీడీపీ)
అనంతపురం – కేశవరెడ్డి (టీడీపీ)
కర్నూలు – డి.విష్ణువర్ధన్ రెడ్డి (టీడీపీ)
డీసీఎంఎస్ ఛైర్మన్స్:
శ్రీకాకుళం – అవినాష్ చౌదరి (టీడీపీ)
విశాఖ – కొట్ని బాలాజీ (టీడీపీ)
విజయనగరం – గొంప కృష్ణ (టీడీపీ)
గుంటూరు – వడ్రాణం హరిబాబు (టీడీపీ)
కృష్ణా – బండి రామకృష్ణ (జనసేన)
నెల్లూరు – గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
చిత్తూరు డీ- సుబ్రమణ్యంనాయుడు (టీడీపీ)
అనంతపురం – నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
కర్నూలు – జి.నాగేశ్వరయాదవ్ (టీడీపీ)
కడప – యర్రగుండ్ల జయప్రకాశ్ (టీడీపీ)