AP High Court: టీడీపీ నేతల గృహనిర్బంధం పిటిషన్పై హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రతిపక్షాలను, ముఖ్యంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోందని పిటిషనర్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారని కోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ తీసుకువచ్చారు. గృహ నిర్బంధం చేయడం చట్టవ్యతిరేకమైన చర్యని న్యాయవాది బాలాజీ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21కు ఈ చర్యలు విరుద్ధమని ఆయన కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వం ఉల్లంగిస్తోందని బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.అధికార పార్టీ కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ… ప్రతిపక్షాలకు అనుమతులు నిరాకరిస్తోందని వాదించారు.
Also Read: Central Cabinet: నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం
Also Read
న్యాయవాది బాలాజీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కౌంటర్ ధాఖలు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. సీయస్, డీజీపీ, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!