AP Violence: హింసాత్మక ఘటనలపై ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
AP Violence: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటైంది. సీఈసీ ఆదేశాలతో సిట్ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ విచారణ జరపనుంది. 13 మంది సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరపనుంది. రెండు రోజుల్లో ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర, ఇన్స్పెక్టర్లు భూషణం, కె.వెంకట్రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్.ప్రభాకర్రావు, శివప్రసాద్లు ఉన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా
Also Read
- Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
- Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
- Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
సిట్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. ఇప్పటికే ఏపీకి 20 కంపెనీల పారామిలటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను రెండెంచల నుంచి మూడెంచలకు పెంచారు. స్ట్రాంగ్ రూంల, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం ఏపీ సీఈఓ క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
-
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
-
Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
-
Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
-
Idiyappam Recipe: హోటల్ స్టైల్ సాఫ్ట్ ‘ఇడియప్పం’ ఇంట్లోనే.. వేడినీళ్ల మ్యాజిక్తో సులభంగా ఇలా చేసేయండి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!