AP Drone Policy: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..
- డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
- రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
- డ్రోన్ పాలసీ 2024-29ను రూపొందించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్
- డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన..రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యం
- ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా ఏపీ
- డ్రోన్ హబ్గా ఓర్వకల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Drone Policy: ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా ఏపీ, డ్రోన్ హబ్గా ఓర్వకల్లు మారనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యాసంస్థలకు 20 లక్షల ప్రోత్సాహం అందించనున్నారు.
Read Also: YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఏపీ అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. డ్రోన్ పాలసీ ద్వారా ఓర్వకల్లును డ్రోన్ల తయారీ హబ్గా మార్చాలని నిర్ణయించామన్నారు. రూ.1000 కోట్ల పెట్టుబడి, రూ. 3000 కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 25 వేల మందికి ప్రత్యక్షంగానూ, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. ఇండియా ఒక పెద్ద మార్కెట్ అని.. డేటా సెంటర్లు కావాలన్నారు. బొంబాయి, మద్రాసు, హైదరాబాద్లలో డేటా సెంటర్లు పెడుతున్నారన్నారు. హైదరాబాద్ కంటే తక్కువగా భూముల విలువలు ఉన్నా మన రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదని చెప్పారు. ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.O కి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువ అవుతాయన్నారు. 2014-19 మధ్యలో ఎలక్ట్రానిక్ మేనుఫ్యాక్చరింగ్ క్లష్టర్లు చంద్రబాబు ఏర్పాటు చేశారని వెల్లడించారు. సెమీ కండక్టర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రారంభించే వారికి 50% సబ్సిడీ లేదా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. చిప్, సెమీకండక్టర్ తయారీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు.
గత ఐదేళ్ళలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకు రావడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీలో ఎలాంటి భూములు అయినా కొత్త చట్టం కిందకు వస్తాయన్నారు. కొత్త చట్టం కింద 10 నుంచీ 14 సంవత్సరాల జైలు, ఆస్తి విలువ, ఆస్తి కూడా పెనాల్టీగా పొందుపరచామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలుకు ప్రత్యేక కోర్టులు తెస్తామన్నారు. ఈ అంశాలపై కలెక్టర్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు.4.57 లక్షల పనులకు సంబంధించి రూ. 331 కోట్ల విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. NREGS చట్టం ప్రకారం 12% వడ్డీ ఇవ్వాలి…ఈ అంశంపై చర్చించామన్నారు. 01.11.2024 నుంచీ చట్టంలోని సెక్షన్ 3(1)(a) కింద జ్యూడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఆమోదం తెలిపిందన్నారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం 3 ఆర్డినెన్స్లు తెచ్చామని.. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్ట సవరణ చేస్తామన్నారు. క్వాలిటీ లిక్కర్ తెచ్చేలా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు.
కుప్పం ప్రధాన కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కేబినెట్ ఆమోదించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 189 కిలోమీటర్ల పొడవైన ORR ను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఏపీ సీఆర్డీఏ 8352.69 చ.కి.మీ లుగా పునరుద్ధరించేందుకు బాపట్ల, మంగళగిరిలలో కలిపిన మండలాలను తిరిగి సీఆర్డీఏలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. విద్యార్ధుల ఫీజు రీఇంబర్సుమెంట్ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని.. విద్యార్థుల ఫీజు నేరుగా కాలేజీ ఖాతాలకు పంపే విధానాన్ని పునరుద్ధరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పిఠాపురం ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు లభించేలా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ డ్యూటీ యాక్ట్ను సవరించడానికి నిర్ణయించామన్నారు. 311 మంది పారిశ్రామికవేత్తలకు APIIC కేటాయించిన భూములను ఆమోదించిందన్నారు. ఇకపై APIIC నుంచీ భూముల కేటాయింపు 50 ఎకరాల వరకూ ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!