AP Drone Policy: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..
- డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
- రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
- డ్రోన్ పాలసీ 2024-29ను రూపొందించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్
- డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన..రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యం
- ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా ఏపీ
- డ్రోన్ హబ్గా ఓర్వకల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Drone Policy: ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా ఏపీ, డ్రోన్ హబ్గా ఓర్వకల్లు మారనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యాసంస్థలకు 20 లక్షల ప్రోత్సాహం అందించనున్నారు.
Read Also: YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ఏపీ అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. డ్రోన్ పాలసీ ద్వారా ఓర్వకల్లును డ్రోన్ల తయారీ హబ్గా మార్చాలని నిర్ణయించామన్నారు. రూ.1000 కోట్ల పెట్టుబడి, రూ. 3000 కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 25 వేల మందికి ప్రత్యక్షంగానూ, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. ఇండియా ఒక పెద్ద మార్కెట్ అని.. డేటా సెంటర్లు కావాలన్నారు. బొంబాయి, మద్రాసు, హైదరాబాద్లలో డేటా సెంటర్లు పెడుతున్నారన్నారు. హైదరాబాద్ కంటే తక్కువగా భూముల విలువలు ఉన్నా మన రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదని చెప్పారు. ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.O కి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువ అవుతాయన్నారు. 2014-19 మధ్యలో ఎలక్ట్రానిక్ మేనుఫ్యాక్చరింగ్ క్లష్టర్లు చంద్రబాబు ఏర్పాటు చేశారని వెల్లడించారు. సెమీ కండక్టర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రారంభించే వారికి 50% సబ్సిడీ లేదా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. చిప్, సెమీకండక్టర్ తయారీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు.
గత ఐదేళ్ళలో భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకు రావడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీలో ఎలాంటి భూములు అయినా కొత్త చట్టం కిందకు వస్తాయన్నారు. కొత్త చట్టం కింద 10 నుంచీ 14 సంవత్సరాల జైలు, ఆస్తి విలువ, ఆస్తి కూడా పెనాల్టీగా పొందుపరచామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలుకు ప్రత్యేక కోర్టులు తెస్తామన్నారు. ఈ అంశాలపై కలెక్టర్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు.4.57 లక్షల పనులకు సంబంధించి రూ. 331 కోట్ల విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. NREGS చట్టం ప్రకారం 12% వడ్డీ ఇవ్వాలి…ఈ అంశంపై చర్చించామన్నారు. 01.11.2024 నుంచీ చట్టంలోని సెక్షన్ 3(1)(a) కింద జ్యూడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఆమోదం తెలిపిందన్నారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం 3 ఆర్డినెన్స్లు తెచ్చామని.. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్ట సవరణ చేస్తామన్నారు. క్వాలిటీ లిక్కర్ తెచ్చేలా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు.
కుప్పం ప్రధాన కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కేబినెట్ ఆమోదించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 189 కిలోమీటర్ల పొడవైన ORR ను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఏపీ సీఆర్డీఏ 8352.69 చ.కి.మీ లుగా పునరుద్ధరించేందుకు బాపట్ల, మంగళగిరిలలో కలిపిన మండలాలను తిరిగి సీఆర్డీఏలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. విద్యార్ధుల ఫీజు రీఇంబర్సుమెంట్ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని.. విద్యార్థుల ఫీజు నేరుగా కాలేజీ ఖాతాలకు పంపే విధానాన్ని పునరుద్ధరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పిఠాపురం ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు లభించేలా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ డ్యూటీ యాక్ట్ను సవరించడానికి నిర్ణయించామన్నారు. 311 మంది పారిశ్రామికవేత్తలకు APIIC కేటాయించిన భూములను ఆమోదించిందన్నారు. ఇకపై APIIC నుంచీ భూముల కేటాయింపు 50 ఎకరాల వరకూ ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!