YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు
- విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు
- విజయనగరం జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని వైఎస్ జగన్ ప్రకటించారు. విజయనగరం జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సీనియర్ నేత చిన అప్పలనాయుడు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పల నాయుడు బొబ్బిలి నుంచి 4సార్లు గెలిచారు. 2019లో ప్రొటెం స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నెల 28న విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. అంటే గట్టిగా ఇరవై రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నాయకుడిని బరిలో నిలిపింది.
Read Also: Somu Veerraju : కూటమి ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతుంది
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడును నిర్ణయించామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయించామన్నారు. పార్టీ నాయకులు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం మేరకు అప్పలనాయుడు పేరు ప్రకటించామని వెల్లడించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్నేత బొత్సకు అవకాశం కల్పించామన్నారు. ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడును పార్టీ నేతలంతా బలపరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అనుభవం, సామాజిక వర్గం రీత్యా అప్పలనాయుడు పేరు ప్రకటించామన్నారు. అప్పలనాయుడు అనుభవజ్క్షడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచామని వెల్లడించారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలన్నారు. విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 అని.. ఇందులో 592 మంది వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!