Purandeshwari: రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeshwari: బీజేపీ సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భం అందరూ చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సమసమాజం స్థాపనకు బీజేపీ పాటుపడుతుందన్నారు. మోడీ అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో రెండు, మూడు స్థానాలకు చేరుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి సహకారం అందించిందన్నారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయిందో చూస్తున్నామని ఆమె వెల్లడించారు. జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉందని.. బీజేపీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.
Also Read: CEO Vikas Raj: సైలెంట్ పీరియడ్ మొదలైంది.. ఈ 48 గంటలు చాలా కీలకం..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
రాష్ట్ర పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పురంధేశ్వరి చెప్పారు. సామాజిక సాధికార యాత్ర చేయడానకి వైసీపీకి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించారు. ఎస్సీలకు చెందిన సుమారు 27 పథకాలు పక్కన పడేశారని.. దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి, సాధికార యాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే తెలీదన్నారు. ఎస్టీ మహిళను రాష్ట్ర పతి చేసిన ఘనత బీజేపీకే చెందుతుందన్నారు. పేదలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం దారి తప్పించి జగన్ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని.. జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. జిల్లాలో నదుల్లో ఉన్న ఇసుక అక్రమంగా దోచుకుంటున్నారని.. మైనింగ్ మాఫియా జిల్లాలో నడుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంతో పేదలకు న్యాయం జరగడం లేదు.. ఏ వర్గం బాగుపడలేదన్నారు. ఆరోగ్య శ్రీకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం అయుష్మాన్ భారత్ పెడితే దాన్ని బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..