Daggubati Purandeswari: అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు: పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారిత కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలని, కండువా వేసుకోవడమే కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలని ఆమె చెప్పారు. కృష్ణా జిల్లా నుంచి బీజేపీలో చేరికలు జరిగాయి. వారికి పార్టీ కండువా కప్పి పురందేశ్వరి బీజేపీలోకి ఆహ్వానించారు.
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… ‘ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగింది. అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పధకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మహిళల సాధికారిత కోసం మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. మోడీ హయాంలో డ్వాక్రా రుణాలను రూ. 20 లక్షల వరకు పెంచారు. తద్వారా ఒక్కో మహిళకు లక్ష నుంచి రెండు లక్షల దాకా వస్తున్నాయి. మహిళా సాధికారితపైన మోడీకి ప్రత్యేక శ్రద్ధ ఉంది’ అని అన్నారు.
Also Read
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
Also Read: NZ vs AUS: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో ‘ఒకే ఒక్కడు’!
‘పొలాల్లో ఎరువులు, పురగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించింది ప్రధాని మోడీనే. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారు. మహిళలను ఏదో సంరక్షిస్తున్నామనే విధంగా కాకుండా.. వాళ్ల కాళ్ల మీద నిలబడేలా మోడీ వ్యవహరిస్తున్నారు. మహిళలకు అన్ని విధాలుగా ప్రధాని అండగా నిలిచారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలి. కండువా వేసుకోవడమే కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలి. అప్పుడే పార్టీ బలోపేతం చెందుతుంది’ అని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!