Daggubati Purandeswari: అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు: పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారిత కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలని, కండువా వేసుకోవడమే కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలని ఆమె చెప్పారు. కృష్ణా జిల్లా నుంచి బీజేపీలో చేరికలు జరిగాయి. వారికి పార్టీ కండువా కప్పి పురందేశ్వరి బీజేపీలోకి ఆహ్వానించారు.
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… ‘ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగింది. అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పధకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మహిళల సాధికారిత కోసం మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. మోడీ హయాంలో డ్వాక్రా రుణాలను రూ. 20 లక్షల వరకు పెంచారు. తద్వారా ఒక్కో మహిళకు లక్ష నుంచి రెండు లక్షల దాకా వస్తున్నాయి. మహిళా సాధికారితపైన మోడీకి ప్రత్యేక శ్రద్ధ ఉంది’ అని అన్నారు.
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
Also Read: NZ vs AUS: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో ‘ఒకే ఒక్కడు’!
‘పొలాల్లో ఎరువులు, పురగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించింది ప్రధాని మోడీనే. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారు. మహిళలను ఏదో సంరక్షిస్తున్నామనే విధంగా కాకుండా.. వాళ్ల కాళ్ల మీద నిలబడేలా మోడీ వ్యవహరిస్తున్నారు. మహిళలకు అన్ని విధాలుగా ప్రధాని అండగా నిలిచారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలి. కండువా వేసుకోవడమే కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలి. అప్పుడే పార్టీ బలోపేతం చెందుతుంది’ అని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!