Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న ఆందోళనలు రాజకీయంగా మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని కాంగ్రెస్కు సూచించారు. ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇలాంటి నిరసనలతో భద్రతా నిబంధనలు కూడా ఉల్లంఘించబడుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రచారం కోసం దేశ విద్యార్థులను అడ్డుపెట్టుకోవడం సమంజసం కాదని, వారి పట్ల అన్ని రాజకీయ పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక, నీట్ పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీల అంశంపై సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
మరోవైపు, విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. జూలై 21న రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నివాసం వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, విద్యా సంస్కరణల కోసం ఉద్యమం చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. జూలై 20న జనపథ్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చగా, నిరసనకారులు మరియు ఢిల్లీ పోలీసులు మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. అనంతరం జంతర్ మంతర్లోని నిరసన శిబిరాలను తొలగించినప్పటికీ, నిరసనకారులు మళ్లీ అక్కడికి చేరుకుని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
LoP Shri @RahulGandhi and @INCIndia continue to shamelessly exploit students as political tools to manufacture disruption during the Monsoon Session of Parliament.
Shri @RahulGandhi and @INCIndia chose to stage a dharna outside the Hon'ble Prime Minister's residence , causing…
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 21, 2026
తాజావార్తలు
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!