Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న ఆందోళనలు రాజకీయంగా మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని కాంగ్రెస్కు సూచించారు. ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇలాంటి నిరసనలతో భద్రతా నిబంధనలు కూడా ఉల్లంఘించబడుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రచారం కోసం దేశ విద్యార్థులను అడ్డుపెట్టుకోవడం సమంజసం కాదని, వారి పట్ల అన్ని రాజకీయ పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక, నీట్ పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీల అంశంపై సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
మరోవైపు, విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. జూలై 21న రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నివాసం వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, విద్యా సంస్కరణల కోసం ఉద్యమం చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. జూలై 20న జనపథ్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చగా, నిరసనకారులు మరియు ఢిల్లీ పోలీసులు మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. అనంతరం జంతర్ మంతర్లోని నిరసన శిబిరాలను తొలగించినప్పటికీ, నిరసనకారులు మళ్లీ అక్కడికి చేరుకుని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
LoP Shri @RahulGandhi and @INCIndia continue to shamelessly exploit students as political tools to manufacture disruption during the Monsoon Session of Parliament.
Shri @RahulGandhi and @INCIndia chose to stage a dharna outside the Hon'ble Prime Minister's residence , causing…
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 21, 2026
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!