Daggubati Purandeswari: అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు: పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారిత కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలని, కండువా వేసుకోవడమే కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలని ఆమె చెప్పారు. కృష్ణా జిల్లా నుంచి బీజేపీలో చేరికలు జరిగాయి. వారికి పార్టీ కండువా కప్పి పురందేశ్వరి బీజేపీలోకి ఆహ్వానించారు.
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… ‘ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగింది. అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పధకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మహిళల సాధికారిత కోసం మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. మోడీ హయాంలో డ్వాక్రా రుణాలను రూ. 20 లక్షల వరకు పెంచారు. తద్వారా ఒక్కో మహిళకు లక్ష నుంచి రెండు లక్షల దాకా వస్తున్నాయి. మహిళా సాధికారితపైన మోడీకి ప్రత్యేక శ్రద్ధ ఉంది’ అని అన్నారు.
Also Read
- iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
- Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
- AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్నినోపై చర్చ!
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
Also Read: NZ vs AUS: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో ‘ఒకే ఒక్కడు’!
‘పొలాల్లో ఎరువులు, పురగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించింది ప్రధాని మోడీనే. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారు. మహిళలను ఏదో సంరక్షిస్తున్నామనే విధంగా కాకుండా.. వాళ్ల కాళ్ల మీద నిలబడేలా మోడీ వ్యవహరిస్తున్నారు. మహిళలకు అన్ని విధాలుగా ప్రధాని అండగా నిలిచారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలి. కండువా వేసుకోవడమే కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలి. అప్పుడే పార్టీ బలోపేతం చెందుతుంది’ అని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Thudakkam : 9 రోజుల్లో రూ. 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్.. స్టార్ హీరో కూతురుకు తొలిసినిమాతోనే భారీ హిట్
-
Lakshmi Mittal Steel Plant: లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై రష్యా దాడి.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
-
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
-
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్కు రెడీ!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?