Vikarabad: రూ. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసిన మరో మహిళ..
- 6 వేల అప్పు తిరిగివ్వలేదని మహిళ దారుణ హత్య
- ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసిన మరో మహిళ
- బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి చెందిన ఈర్లపల్లి యశోద హత్య కేసును పోలీసులు చేధించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పు నిప్పుతో సమానం.. నిలువునా కాల్చేస్తది అనడంలో సందేహం లేదు. తీరని అప్పు ఎప్పటికైనా ముప్పే. తీసుకున్న అప్పు తీర్చనందుకు ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాజా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసింది మరో మహిళ. వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ లో వీడిన హత్య మిస్టరీ… నిందితులను పట్టుకున్న పోలీసులు.. బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి చెందిన ఈర్లపల్లి యశోద హత్య కేసును పోలీసులు చేధించారు.
Also Read:Fire Break : కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
పరిగి మండలం రామ్ రెడ్డి పల్లి తండాకు చెందిన అనిత, దోమ మండలం ఉట్పల్లికి చెందిన గోపాల్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనిత, గోపాల్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అనిత గోపాల్ మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. యశోద కొంతకాలం క్రితం అనిత దగ్గర రూ. 6 వేలు అప్పు తీసుకున్నది. యశోదను అప్పు తిరిగి చెల్లించాలని పలుమార్లు అనిత అడిగింది. డబ్బులు ఇవ్వకపోవడంతో యశోద హత్యకు ప్రియుడు గోపాల్ తో కలిసి ప్లాన్ చేసింది. హత్య చేసి యశోద ఒంటిపై ఉన్న బంగారం కాజేయాలని కుట్ర పన్నారు.
Also Read:Khadar Bhasha: టీడీపీ, జనసేన పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడాలి..
ఈనెల 1న అప్పు విషయం మాట్లాడదామని యశోదకు ఫోన్ చేసి గోపాల్ రప్పించాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించి.. యశోద అకస్మారక స్థితికి వెళ్ళిన తర్వాత ఆమె చీరతో మెడకు చుట్టి హత్య చేశారు. అనంతరం గోపాల్, అనిత మృతురాలి ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. ఆ తర్వాత గోపాల్, అనిత పెద్దేముల్ సమీపంలోని కోటిపల్లి కాలువలో యశోద మృతదేహాన్ని పారేసి.. ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. రూ. 6 వేలు అప్పు తీర్చనందుకు హత్య చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!