Andhrapradesh: అడవుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశే ఆదర్శం.. అటవీ సంరక్షణ బిల్లుపై విజయసాయి రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: అటవీప్రాంతంలో నివసించే ప్రజలను కూడా సమాన భాగస్వాములను చేసినప్పుడే అడవుల పరిరక్షణ పటిష్టంగా జరుగుతుందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమూహాలు, ప్రభుత్వం ఉమ్మడి కృషి ఒక్కటే అడవుల పరిరక్షణకు ఏకైక పరిష్కారం అని ఆయన అన్నారు. ఈ విషయంలో గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్న భాగస్వామ్య అటవీ యాజమాన్య విధానాన్ని(పీఎఫ్ఎం) యావత్తు దేశం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి అటవీ యాజమాన్య విధానం (జేఎఫ్ఎం), సామూహిక యాజమాన్య విధానం (సీఎఫ్ఎం) విధానాలను అనుసరించే ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య అటవీ యాజమాన్య వ్యవస్థ కొనసాగుతోందని విజయసాయి రెడ్డి చెప్పారు.
Also Read: CM KCR: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
Also Read
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
స్థానిక ప్రజలతో ఏర్పడిన వన సంరక్షణ సమితులే రాష్ట్రవ్యాప్తంగా అడవులకు సంరక్షకులు అయ్యాయి. భాగస్వామ్య అటవీ యాజమాన్య విధానం ఆంధ్రప్రదేశ్లో సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగస్వాములైన స్థానిక ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. అడవుల జీర్ణోద్దరణ గణనీయంగా జరుగుతోంది. పోడు వ్యవసాయం కోసం అడవుల నరికివేత తగ్గింది. అక్రమ కలప వ్యాపారం కోసం చెట్ల నరికివేత తగ్గింది. అటవీ ఉద్యోగుల భద్రత పెరిగిందని ఆయన వివరించారు. రాజ్యాంగపరంగా అడవులు రాష్ట్ర జాబితా కింద గుర్తించినా దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో క్రమేపీ అవి ఉమ్మడి జాబితా కిందకు చేరాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అడవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే సౌలభ్యం ఉంది. అయితే ఈ బిల్లులో పొందుపరచిన ఒక క్లాజ్ కింద అడవుల వినియోగం, అటవీ భూముల అసైన్మెంట్ వంటి అంశాలపై ఇకమీదట నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని పేర్కొనడం జరిగింది. అంటే ఇక మీదట ఏ ప్రైవేట్ సంస్థకైనా భూములు కేటాయించదలిచినపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై అటవీ శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. అడవులకు సంబంధించిన చట్టాల రూపకల్పన లేదా సవరణలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం విధిగా ఆయా రాష్ట్రాలను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..