Odisha: మరీ ఇంత దారుణమా? గిరిజన యువతిపై అసభ్య ప్రవర్తన.. మానవ మలాన్ని నోటిలో..
- ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో దారుణం
- గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన
- మానవ మలాన్ని నోటిలో పోసిన వ్యక్తి
- స్టేషన్లో ఫిర్యాదు చేసిన యువతి
- వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఓ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వ్యక్తి (మానవ) మలాన్ని బలవంతంగా నోటిలో పోశాడు. ఈ ఘటన బంగముండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరబంధ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు 20 ఏళ్ల యువతిపై దాడి చేసి వేధించాడని చెబుతున్నారు.
ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
READ MORE: Leopard: చిరుతను చంపి.. వండుకుని తిన్నారు.. ఎక్కడంటే?
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
ఫిర్యాదు ప్రకారం.. గిరిజనేతరుడైన నిందితుడు మహిళ పొలంలో నుంచి ట్రాక్టర్ను తీసుకెళ్తున్నాడు. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీనిపై మహిళ నిరసన వ్యక్తం చేస్తూ ట్రాక్టర్ను తమ పొలంలో నుంచి తీసుకెళ్లవద్దని కోరింది. ఆ సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశాడు. మహిళను దుర్భాషలాడుతూనే, నిందితుడు ఆమె కులం మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఘర్షణ పెరగడంతో.. బలవంతంగా ఆమె నోటిలో మానవ మలాన్ని పోశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. యువతి ఫిర్యాదు మేరకు బంగోముండ పోలీసులు 288/24 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
READ MORE: Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
కాగా, నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బిజూ జనతాదళ్ (బిజెడి) ఎంపీ నిరంజన్ బీసీ ఆరోపించారు. దీని కారణంగా గిరిజనులలో ఆగ్రహం వ్యక్తమైంది. ఘటన అనంతరం స్థానిక గిరిజన సంఘాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోకుంటే ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!