Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
- ఎక్కువ సేపు కూర్చోవడటం ప్రమాదకరం
- గంటల తరబడి కూర్చుంటే అనే వ్యాధులు
- గుండె, మెదడు, కాలేయం, కిడ్నీలపైన ప్రభావం
- శారీరక శ్రమ తక్కువగా చేసే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు
- ప్రతి గంటకు కనీసం 3 నిమిషాల పాటు అటు ఇటూ నడవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫీసుల్లో, ఇళ్లలో కొంత మంది కుర్చీలకు అంటి పెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికనట్లే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే.. త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కూర్చునే వారిలో గుండె, మెదడు, కాలేయం, కిడ్నీలపైన ప్రభావం పడి.. పనితీరు మందగిస్తుందని చెబుతున్నారు. ఇలా శారీరక శ్రమ తక్కువగా చేసే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు. ఫలితంగా జీవిత కాలం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.
READ MORE: Koti Deepotsavam 2024 Day 12: ఘనంగా వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆది దంపతుల కల్యాణోత్సవం
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం వల్ల కండరాల్లో కదలికలు లేకుండా పోతుందట. ఫలితంగా తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి.. శరీరంలో అక్కడక్కడ పేరుకుపోయి స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోయి.. రక్త నాళాల్లో ఒత్తిడి పెరిగుతోంది. ఫలితంగా రక్త నాళాలు వ్యాకోచించి ఉబ్బిపోతాయి. దీంతో వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందట. కాళ్ల నుంచి మొదలై ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. వెన్ను కండరాలపై ఒత్తిడి తీవ్రంగా పడి.. మెడ, వెన్నుపూస ఒత్తిడికి గురై పాడైపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా ఎక్కువ సేపు కూర్చోని ఉండడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
READ MORE:Kishan Reddy: ది సబర్మతి రిపోర్ట్ సినిమా చూసిన కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే?
వారిలో తక్కువ కేలరీలు కరిగిపోయి.. కొవ్వు పెరిగిపోయి క్రమంగా డయాబెటిస్ బారిన పడతారట. ఇంకా అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. అలాగే వీరిలో కదలికలు లేకపోవడం వల్ల రక్త ప్రసరణ వేగం మందగించి.. క్రమంగా గుండె సమస్యలు కూడా వస్తుంటాయని అంటున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందట. ముఖ్యంగా పేగు, ఎండో మెట్రియల్ ఊపిరితిత్తుల క్యాన్సర్, వయసు పైబడిన వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందట. అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజు సగటను 7-8వేల అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పని ప్రదేశంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా ప్రతి గంటకు కనీసం 3 నిమిషాల పాటు అటు ఇటూ నడవాలట. నిత్యం నడక, వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు పాటించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!