Leopard: చిరుతను చంపి.. వండుకుని తిన్నారు.. ఎక్కడంటే?
- ఒడిశాలో దారుణ ఘటన
- చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు
- అడవి పందుల వలలో చిక్కిన చిరుత
- దాన్ని చంపి వండుకుని తిన్న వేటగాళ్లు
- ఇద్దరిని అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నువాపా జిల్లా దేవ్ధార గ్రామ సమీపంలో జరిగింది.
READ MORE: Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
అటవీశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పుస్తం చిందా(58), హృషికేష్ చిందా(40)లు ఈనెల 16న అడవి పందులను పట్టుకునేందుకు అడవిలో ఉచ్చు వేశారు. దురదృష్టవశాత్తు, ఒక చిరుతపులి ఆ వలలో చిక్కుకుంది. చిరుతపులిని చంపి చర్మం ఒలిచి మాంసాన్ని వండుకుని తిన్నారనేది ఆరోపణ. రహస్య సమాచారం ఆధారంగా.. అటవీ శాఖ బృందం వారి ఇళ్లపై దాడి చేసి చిరుతపులి చర్మం, తల, కొంత వండిన మాంసాన్ని సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకుంది. ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. అయితే మరో ఇద్దరు సహచరులు పరారీ అయ్యారు.
READ MORE: Koti Deepotsavam 2024 Day 12: ఘనంగా వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆది దంపతుల కల్యాణోత్సవం
ఈ ఘటనపై ఖరియార్ టెరిటోరియల్ డివిజన్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ACF), MD ముస్తఫా సలేహా మాట్లాడుతూ.. “ఈ కేసు వన్యప్రాణుల సంరక్షణకు వ్యతిరేకంగా జరిగిన తీవ్రమైన నేరాన్ని సూచిస్తుంది. క్రూర జంతువుల జాబితాలో ఉన్న చిరుతను చంపి తినడం గతంలో ఎన్నడూ చూడలేదు. అటవీ జంతువుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత నిందితులను కోర్టులో హాజరు పరుస్తాం.” అని తెలిపారు. కాగా.. వన్యప్రాణుల నేరాలపై ఎలాంటి ఉపశమనమూ ఉండదని అటవీశాఖ హెచ్చరించింది. అలాగే, ఇలాంటి నేరాల గురించి వెంటనే డిపార్ట్మెంట్కు తెలియజేయాలని సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ సంఘటన వన్యప్రాణుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, పరిరక్షణ కోసం పరిపాలన, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..