Delhi: ప్రైవేట్ భాగాలను బైక్తో తొక్కించి.. చేతులు, కాళ్లు కట్టి యువకుడి నోటిలో మూత్ర విసర్జన
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్లో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా శనివారం రాత్రి ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. అంతకు ముందు యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అతని ప్రైవేట్ భాగాలను బైక్తో తొక్కించి.. కారం చల్లారు. ఆ యువకుడు నొప్పితో కేకలు వేస్తుండటంతో చేతులు, కాళ్లు కట్టి నోటిలో మూత్ర విసర్జన చేశారు నిందితులు. ఈ క్రూర ఘటన ఓ వీధిలో జరిగింది. అయితే.. ఆ యువకుడిని రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. యువకుడు శివ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. యువకుడి స్వస్థలం మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని రాగోలి. కాగా.. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులు నైనా అలియాస్ మీనా, రోహిత్లను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..
Also Read
వివరాల్లోకి వెళ్తే.. యువకుడు కరణ్ మానసికంగా బాధపడుతున్నట్లు అతని సోదరుడు నిశాంత్ తెలిపాడు. కరణ్ కు ఊరికనే కోపం వస్తుందని, ఈ క్రమంలో అనేక మందితో చాలాసార్లు గొడవ పడేవాడని చెప్పాడు. ఈ క్రమంలో.. కొన్ని నెలల క్రితం ఆ ప్రాంతంలో చిరుధాన్యాలు అమ్మే మహిళ మీనాతో గొడవ పడ్డాడు. దీంతో.. అతనిపై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా.. యువకుడిని తన స్వగ్రామానికి పంపించారు. అయితే.. అతని కేసు కోర్టులో ఉంది కావున.. ఇటీవల కరణ్ను ఉత్తమ్ నగర్కు పిలిచారు. ఈ సమయంలో కరణ్ ఇక్కడికి వచ్చాడని మీనాకు తెలిసింది.
KTR : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలి
ఈ క్రమంలో.. శనివారం రాత్రి కరణ్ ఇంట్లో ఉన్న సమయంలో మీనా డజను మందితో కర్రలు, కత్తులతో అక్కడికి వచ్చారు. ఉన్నట్టుండి కరణ్పై దాడికి దిగారు. కరణ్ని రక్షించడానికి ఇరుగుపొరుగువారు కూడా సాహసించకపోవడంతో వారు అతన్ని తీవ్రంగా కొట్టారు. మధ్యలో ఎవరైనా వస్తే ఇలాగే చంపేస్తామని నిందితులు బెదిరించారు. కరణ్ను మొదట కొట్టి, ఆపై అతని ప్రైవేట్ భాగాలపై బుల్లెట్ బైక్తో తొక్కించారు. అంతేకాకుండా గాయాలపై ఉప్పు, కారం చల్లారు. తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో మూత్రం పోశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కరణ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో మీనా, రోహిత్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. విచారణలో మీనా ఆరు నెలల క్రితం తన ఇంట్లో మొబైల్, ఇతర వస్తువులను దొంగిలించాడని చెప్పింది. దీంతో అతడిని కొట్టామని పేర్కొంది.
- Tags
- Atrocity
- death
- Delhi
- telugu news
- urin
తాజావార్తలు
-
Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
-
Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
-
Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!