Cheating: ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు
- ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి
- పెళ్లి చేసుకుంది
- ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణాల్లో ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయాలు ప్రేమకు దారితీస్తాయి. ఇలాగే ఓ యువతి ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డకు తల్లైంది. కానీ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన రాధ అనే మహిళ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. పానపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఉభవన్ సారంగ్పూర్ గ్రామానికి చెందిన తుంటున్ సాహ్ని తనను మోసం చేశాడని రాధ ఆరోపించింది.
Also Read:Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
రెండేళ్ల క్రితం తాను పని కోసం రైలులో లూధియానాకు వెళ్తున్నానని బాధితురాలు చెప్పింది. టుంటున్ సాహ్ని కూడా అదే రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది. టుంటన్ ఫోన్ కాల్స్ చేసేవాడని.. ఆ తర్వాత క్రమంగా దగ్గరయ్యామని తెలిపింది. టుంటున్ వివాహాన్ని ప్రతిపాదించాడని తెలిపింది.. ఆ తర్వాత రాధ బావమరిది, ఇతర బంధువుల మధ్యవర్తిత్వంతో ఇద్దరూ చండీగఢ్లో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. రాధను దూరం పెడుతూ చివరకు రాధను చండీగఢ్లో వదిలి గ్రామానికి తిరిగి వచ్చాడు. భర్త తనను మోసం చేశాడని గ్రహించిన రాధ పోలీసుల సాయంతో భర్త ఇంటికి చేరుకుంది. కొంతకాలం అత్తింట్లోనే ఉంది. ఈ సమయంలో ఆమె భర్త డబ్బు సంపాదన కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అత్త కూడా వేధించడం ప్రారంభించింది. విసిగిపోయిన బాధితురాలు రాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!