Cheating: ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు
- ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి
- పెళ్లి చేసుకుంది
- ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణాల్లో ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయాలు ప్రేమకు దారితీస్తాయి. ఇలాగే ఓ యువతి ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డకు తల్లైంది. కానీ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన రాధ అనే మహిళ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. పానపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఉభవన్ సారంగ్పూర్ గ్రామానికి చెందిన తుంటున్ సాహ్ని తనను మోసం చేశాడని రాధ ఆరోపించింది.
Also Read:Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
రెండేళ్ల క్రితం తాను పని కోసం రైలులో లూధియానాకు వెళ్తున్నానని బాధితురాలు చెప్పింది. టుంటున్ సాహ్ని కూడా అదే రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది. టుంటన్ ఫోన్ కాల్స్ చేసేవాడని.. ఆ తర్వాత క్రమంగా దగ్గరయ్యామని తెలిపింది. టుంటున్ వివాహాన్ని ప్రతిపాదించాడని తెలిపింది.. ఆ తర్వాత రాధ బావమరిది, ఇతర బంధువుల మధ్యవర్తిత్వంతో ఇద్దరూ చండీగఢ్లో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. రాధను దూరం పెడుతూ చివరకు రాధను చండీగఢ్లో వదిలి గ్రామానికి తిరిగి వచ్చాడు. భర్త తనను మోసం చేశాడని గ్రహించిన రాధ పోలీసుల సాయంతో భర్త ఇంటికి చేరుకుంది. కొంతకాలం అత్తింట్లోనే ఉంది. ఈ సమయంలో ఆమె భర్త డబ్బు సంపాదన కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అత్త కూడా వేధించడం ప్రారంభించింది. విసిగిపోయిన బాధితురాలు రాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!