Ambati Rambabu: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడాన్ని జగన్ అకౌంట్లో వేయడం దారుణం
- తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది
- దీనిని జగన్ అకౌంట్లో వేయడం దారుణం
- ఏది జరిగినా జగన్పై నెట్టేసి తప్పుకోవాలని చూస్తున్నారని అంబటి రాంబాబు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్పై నెట్టేసి తప్పుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర నుంచి 90,000 క్యూసెక్కుల నీరు బయటకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల , నిర్వహణ లోపం వల్ల ఈ వ్యవహారం జరిగిందని కొన్ని పార్టీలు వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. తుంగభద్ర ప్రాజెక్టు మూడు రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీతోపాటు, సీడబ్ల్యూసీ ఈ డ్యాంను పర్యవేక్షణ చేస్తున్నాయన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం దురదృష్టకరమన్నారు.
Read Also: Minister Anitha: క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదు.. మరి ఎప్పుడంటే?
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఈ రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మీద వేసి తప్పుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైయస్ జగన్ పాలన చేస్తున్నప్పుడు పులిచింతల గేటు కొట్టుకుపోతే 20 రోజుల్లో గేటు పెట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. గతంలో గుండ్లకమ్మ గేటు కూడా కొట్టుకుపోయిందని.. గతంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోవడానికి, చంద్రబాబు హయాంలో జరిగిన అలసత్వమే కారణమని అన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు పాలన సాగించారు.. చంద్రబాబు చాలా అనుభవం ఉన్న వ్యక్తి లాగా ప్రచారం చేసుకుంటాడని విమర్శలు గుప్పించారు.
పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించానని చంద్రబాబు చెప్తున్నాడని.. 75 ఏళ్ల వయసు ,14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఏమనాలి అంటూ వ్యాఖ్యానించారు. ఏ పని అడిగినా ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అమ్మ ఒడి ,తల్లికి వందనం లాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు దూరం అయ్యాయన్నారు. ప్రజలకు మోసపు మాటలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు దూరం అయిపోయాయన్నారు. సంపద సృష్టిస్తాను అని చెప్పే చంద్రబాబు రెండు మాసాల పాలన వైఫల్యం చెందిందని…రెండు నెలలు గడిచేలోపే,ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశాం రా బాబు అని ప్రజలు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!