Amaravati Relaunch: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.. త్వరలో బీసీలకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న కృష్ణయ్య!
- ప్రధాని మోడీ చిత్రపటానికి ఆర్. కృష్ణయ్య పాలాభిషేకం
- త్వరలో బీసీలకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న కృష్ణయ్య
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పాలాభిషేకం చేశారు. బీసీల పట్ల మోడీకి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి వల్లే కులగణన సాధ్యమైందన్నారు. కులాల లెక్కలు తీయడం ద్వారా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లభించనున్నాయని పేర్కొన్నారు. ఇది బీసీల విజయం మాత్రమే కాదు.. దేశంలో ఓ కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. జనగణనలో కుల గణన చేయడానికి స్వాతంత్య్రం ఉన్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదని విమర్శించారు. అనేక కమిషన్లకు లెక్కలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోలేదని తెలిపారు. మోడీ ఓబీసీల పట్ల నిజమైన కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని ప్రశంసించారు. త్వరలోనే బీసీలకు కేంద్ర మంత్రి పదవి లభించనుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై చిత్తశుద్ధితో వ్యవహరించలేదని కృష్ణయ్య ఆరోపించారు.
Also Read: Amaravati Sabha: సైకిల్ యాత్రగా అమరావతి సభా ప్రాంగణానికి ఎంపీ కలిశెట్టి!
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఇక ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనను చారిత్రక ఘట్టం అన్నారు ఆర్. కృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రాజధాని విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ, ఇప్పుడు అమరావతి అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు. హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు, అమరావతిని అదే విధంగా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు కృష్ణయ్య. బీసీలు భారత మాత ముద్దు బిడ్డలు.. ఇది బీసీల మొదటి విజయం కాదు దేశంలో ఓ కొత్త శకం ప్రారంభమైందన్నారు. కొన్ని పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరుసగా ఎన్నికల్లో మోడీ గెలుస్తున్నారు, మోడీ ఓబీసీల పట్ల నిజమైన కమిట్మెంట్ ఉన్న నాయకుడు, మోడీ నాయకత్వంలో బీసీలకు మంచి జరిగింది, త్వరలో బీసీలకు కేంద్ర మంత్రిపదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కృష్ణయ్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదు, లెక్కలు తీసుకుంది, కులగణనపై కాంగ్రెస్కు నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!