Amaravati Relaunch: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.. త్వరలో బీసీలకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న కృష్ణయ్య!
- ప్రధాని మోడీ చిత్రపటానికి ఆర్. కృష్ణయ్య పాలాభిషేకం
- త్వరలో బీసీలకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న కృష్ణయ్య
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నారు
విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పాలాభిషేకం చేశారు. బీసీల పట్ల మోడీకి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి వల్లే కులగణన సాధ్యమైందన్నారు. కులాల లెక్కలు తీయడం ద్వారా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లభించనున్నాయని పేర్కొన్నారు. ఇది బీసీల విజయం మాత్రమే కాదు.. దేశంలో ఓ కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. జనగణనలో కుల గణన చేయడానికి స్వాతంత్య్రం ఉన్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదని విమర్శించారు. అనేక కమిషన్లకు లెక్కలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోలేదని తెలిపారు. మోడీ ఓబీసీల పట్ల నిజమైన కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని ప్రశంసించారు. త్వరలోనే బీసీలకు కేంద్ర మంత్రి పదవి లభించనుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై చిత్తశుద్ధితో వ్యవహరించలేదని కృష్ణయ్య ఆరోపించారు.
Also Read: Amaravati Sabha: సైకిల్ యాత్రగా అమరావతి సభా ప్రాంగణానికి ఎంపీ కలిశెట్టి!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇక ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనను చారిత్రక ఘట్టం అన్నారు ఆర్. కృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రాజధాని విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ, ఇప్పుడు అమరావతి అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు. హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు, అమరావతిని అదే విధంగా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు కృష్ణయ్య. బీసీలు భారత మాత ముద్దు బిడ్డలు.. ఇది బీసీల మొదటి విజయం కాదు దేశంలో ఓ కొత్త శకం ప్రారంభమైందన్నారు. కొన్ని పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరుసగా ఎన్నికల్లో మోడీ గెలుస్తున్నారు, మోడీ ఓబీసీల పట్ల నిజమైన కమిట్మెంట్ ఉన్న నాయకుడు, మోడీ నాయకత్వంలో బీసీలకు మంచి జరిగింది, త్వరలో బీసీలకు కేంద్ర మంత్రిపదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కృష్ణయ్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదు, లెక్కలు తీసుకుంది, కులగణనపై కాంగ్రెస్కు నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!