Congress- AAP Alliance: కాంగ్రెస్- ఆప్ మధ్య కుదిరిన సీట్ షేరింగ్.. ఏ రాష్ట్రంలో ఎన్నో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress- AAP: లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవా, చండీగఢ్లలో సీట్ షేరింగ్కు రెండు పార్టీలు ఓకే చెప్పుకున్నాయి. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, ఆప్ నేత సందీప్ పాఠక్లు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఢిల్లీలోని 7 సీట్లకు గాను.. కాంగ్రెస్ 3, ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో ఆప్ పోటీ చేస్తుండగా.. చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది. ఇక, గుజరాత్లోని భరూచ్, భావ్నగర్లలో కేజ్రీవాల్ పార్టీ పోటీ చేయనుండగా, మిగిలిన 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది.
Read Also: Queen 2 : ‘క్వీన్’ సీక్వెల్కు కథ సిద్ధం..సీక్వెల్ లో కంగనా నటిస్తుందా..?
Also Read
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- Axar Patel: "రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు".. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
అలాగే, హర్యానాలో 10 స్థానాల్లో ఒక స్థానాన్ని(కురుక్షేత్ర) ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. గోవాలో ఉన్న రెండు స్థానాలు, చండీగఢ్లోని ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేసేందుకు బరిలోకి దిగుతుంది. సుధీర్ఘ చర్చల అనంతరం సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్- ఆప్ పార్టీలు తుది నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, ఐదు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటించిన ఇరు పార్టీలు పంజాబ్పై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఇరు పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతాయని గతంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Read Also: Uttar Pradesh: వామ్మో దాని కోసం ఏకంగా యూపీ హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల పిల్లాడు..
పంజాబ్ రాష్ట్రంలో 13 లోక్ సభ స్థానాలుండగా అక్కడ ఆప్ అధికారంలో ఉంది. ఇప్పటికే యూపీలోనూ సీట్ షేరింగ్పై క్లారిటీ రావడంతో పాటు తాజాగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదరడంతో ఇండియా కూటమికి కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్- శివసేన (యూబీటీ) మధ్య ఎనిమిది సీట్లపై ఇంకా నిర్ణయంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక్కడ కూడా చర్చలు దాదాపు ముగిశాయి.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
-
Varanasi OTT Deal : ‘వారణాసి’ ఓటీటీ డీల్ సెట్టా… నెట్ ఫ్లిక్స్ రిప్లై వైరల్
-
NBK 112 : అమరావతిలో అంగరంగ వైభవంగా NBK 112.. క్లాప్ కొట్టిన నారా లోకేష్
-
Axar Patel: “రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు”.. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!