Alleti Maheshwar Reddy : తెలంగాణ రాష్ట్ర అత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబర్ 17
- భారీ వర్షాలతో ఆస్తి
- ప్రాణ నష్టం సంభవించిందన్న బీజేఎల్పీ నేత
- వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు 3 లక్షలు కేంద్రం సహాయం
- అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నిర్వహించలేకపోతోందని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలతో తెలంగాణలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రెండు కేంద్ర బృందాలు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నాయని, NDRF బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు కేంద్రం సహాయం ప్రకటించిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబర్ 17 అని, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నిర్వహించలేకపోతోందని ఆయన విమర్శించారు. సెప్టెంబర్ 17 స్వాతంత్ర దినోత్సవంగా, విమోచన దినోత్సవంగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేకపోతోంది? అని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని గత BRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచన లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి అవకాశం ఉందని, కర్ణాటక లో అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు మహేశ్వర్ రెడ్డి. MIM కు భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదా ? అని ఆయన అన్నారు.
Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
అంతేకాకుండా..’ BRS ప్రభుత్వం జాతీయ సమైక్యత దినంగా నిర్వహించారు.. అసలు సమైక్యత దినం కాదు.. విమోచన దినంగా కాంగ్రెస్ నిర్వహించాలి. నిజాం పాలనలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చరిత్రను కప్పిపుచ్చడానికే విమోచన దినం నిర్వహించడం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విమోచన దినం జరపడం లేదని ప్రశ్నించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారు. పదేళ్ల BRS పాలనలో విమోచన దినం జరపకుండా కాలయాపన చేశారు. సెప్టెంబర్ 17 విలీన దినం కాదు.. ఖచ్చితంగా విమోచన దినమే. భావితరాలకు చరిత్ర తెలియాలంటే విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. విమోచన దినోత్సవం ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదు. స్వాతంత్ర దినోత్సవం గా సెప్టెంబర్ 17ను జరుపుకుందాం. MIM ఆనందం కోసం విమోచన దినోత్సవం జరపడం లేదా? వరంగల్ మున్సిపల్ లో ఓ ప్రభుత్వ కార్యక్రమం లో కాకతీయ తోరణం లేకుండా లోగో ఏర్పాటు చేశారు. లోగో అధికారికంగా విడుదల చేశారా ? లోగో లో కాకతీయ తోరణం ఎందుకు తొలగించారు ?’ అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Paris Paralympics 2024: భారత్ ఖాతాలో మరో రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
తాజావార్తలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!