Paris Paralympics 2024: భారత్ ఖాతాలో మరో రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
- పారిస్ పారాలింపిక్స్లో భారత్ కు పతకాల పంట
- మరో రజతం సాధించిన పారాథ్లెట్
పారిస్ పారాలింపిక్స్లో భారత్ కు పతకాల పంట పండుతుంది. 4వ తేదీన (బుధవారం) భారత పారాథ్లెట్ సచిన్ సర్జేరావు ఖిలారీ సంచలనం సృష్టించాడు. పురుషుల షాట్పుట్ (ఎఫ్46)లో సచిన్ రజత పతకం సాధించాడు. సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ప్రస్తుత పారాలింపిక్స్లో భారత్కు ఇది 21వ పతకం. భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సచిన్ సర్జేరావ్ ఖిలారీ తన రెండో ప్రయత్నంలో 16.32 మీటర్లు విసిరాడు. ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టీవర్ట్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. స్టీవర్ట్ అత్యుత్తమ త్రో 16.38 మీటర్లు. కాగా, క్రొయేషియాకు చెందిన బకోవిచ్ లుకా (16.27 మీటర్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
READ MORE: Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
కాగా.. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగనున్న 2024 పారిస్ పారాలింపిక్స్లో రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పారాలింపిక్స్లో 12 విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. పారిస్ పారాలింపిక్స్లో భారత్ హవా కొనసాగుతోంది. నేటివరకు 21 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఈ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020 టోక్యో పారాలింపిక్స్లో కూడా భారత్ అత్యధిక పతకాలను గెలుచుకుంది. ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో సహా 19 పతకాలను భారత్ ఖాతాలో వేసుకుంది. పారిస్ పారాలింపిక్స్లో ఇప్పటి వరకు 21 మెడల్స్ గెలిచి.. గత రికార్డును బ్రేక్ చేశారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!