Paris Paralympics 2024: భారత్ ఖాతాలో మరో రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
- పారిస్ పారాలింపిక్స్లో భారత్ కు పతకాల పంట
- మరో రజతం సాధించిన పారాథ్లెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ పారాలింపిక్స్లో భారత్ కు పతకాల పంట పండుతుంది. 4వ తేదీన (బుధవారం) భారత పారాథ్లెట్ సచిన్ సర్జేరావు ఖిలారీ సంచలనం సృష్టించాడు. పురుషుల షాట్పుట్ (ఎఫ్46)లో సచిన్ రజత పతకం సాధించాడు. సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ప్రస్తుత పారాలింపిక్స్లో భారత్కు ఇది 21వ పతకం. భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సచిన్ సర్జేరావ్ ఖిలారీ తన రెండో ప్రయత్నంలో 16.32 మీటర్లు విసిరాడు. ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టీవర్ట్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. స్టీవర్ట్ అత్యుత్తమ త్రో 16.38 మీటర్లు. కాగా, క్రొయేషియాకు చెందిన బకోవిచ్ లుకా (16.27 మీటర్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
READ MORE: Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
Also Read
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
కాగా.. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగనున్న 2024 పారిస్ పారాలింపిక్స్లో రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పారాలింపిక్స్లో 12 విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. పారిస్ పారాలింపిక్స్లో భారత్ హవా కొనసాగుతోంది. నేటివరకు 21 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఈ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020 టోక్యో పారాలింపిక్స్లో కూడా భారత్ అత్యధిక పతకాలను గెలుచుకుంది. ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో సహా 19 పతకాలను భారత్ ఖాతాలో వేసుకుంది. పారిస్ పారాలింపిక్స్లో ఇప్పటి వరకు 21 మెడల్స్ గెలిచి.. గత రికార్డును బ్రేక్ చేశారు.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..