Group-1 Prelims: ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్… అభ్యర్థులకు సూచనలు చేసిన టీఎస్పీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Prelims: ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలు చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు గ్రూప్ – I సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. పరీక్ష సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల నుండి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అభ్యర్థుల నిర్దిష్ట ఓఎంఆర్ షీట్లు, శిక్షణ పొందిన బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు,. స్ట్రాంగ్ రూమ్లు, పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం పరీక్షను సజావుగా నిర్వహించడం కోసం చీఫ్ సూపరింటెండెంట్లందరితో సమర్థవంతమైన సమన్వయం కోసం ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక RC చొప్పున ప్రాంతీయ సమన్వయకర్తలు (RC) కమిషన్ నుండి నియమించబడ్డారు. మొత్తం 897 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్ల నియామక ఉత్తర్వులను కమిషన్ జారీ చేసింది.
Read Also: Bhatti Vikramarka: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్, పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుండి 5 కేంద్రాలను తనిఖీ చేసే ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్ నంబర్లు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే కాకుండా ప్రతి పరీక్ష కేంద్రం కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులను అభ్యర్థించడం జరిగింది. పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని TGSRTCని కోరారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో రెవెన్యూ శాఖ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10:00 గంటలకు గేట్లు క్లోజ్ చేయనున్నారు. పరీక్షా కేంద్రం యొక్క గేట్లు మూసివేసిన తరువాత అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు A4 పరిమాణ కాగితంపై ముద్రించిన హాల్ టికెట్ను లేజర్ ప్రింటర్తో తీసుకురావాలని సూచించారు. కలర్ ప్రింట్ తీసుకుంటే మంచిదని అధికారులు తెలిపారు. పరీక్షకు రాకముందు ప్రింటెడ్ హాల్ టికెట్లో అందించిన స్థలంలో (3) మూడు నెలలకు ముందు తీసుకున్న పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించడం తప్పనిసరి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!