Group-1 Prelims: ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్… అభ్యర్థులకు సూచనలు చేసిన టీఎస్పీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Prelims: ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలు చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు గ్రూప్ – I సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. పరీక్ష సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల నుండి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అభ్యర్థుల నిర్దిష్ట ఓఎంఆర్ షీట్లు, శిక్షణ పొందిన బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు,. స్ట్రాంగ్ రూమ్లు, పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం పరీక్షను సజావుగా నిర్వహించడం కోసం చీఫ్ సూపరింటెండెంట్లందరితో సమర్థవంతమైన సమన్వయం కోసం ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక RC చొప్పున ప్రాంతీయ సమన్వయకర్తలు (RC) కమిషన్ నుండి నియమించబడ్డారు. మొత్తం 897 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్ల నియామక ఉత్తర్వులను కమిషన్ జారీ చేసింది.
Read Also: Bhatti Vikramarka: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్, పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుండి 5 కేంద్రాలను తనిఖీ చేసే ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్ నంబర్లు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే కాకుండా ప్రతి పరీక్ష కేంద్రం కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులను అభ్యర్థించడం జరిగింది. పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని TGSRTCని కోరారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో రెవెన్యూ శాఖ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10:00 గంటలకు గేట్లు క్లోజ్ చేయనున్నారు. పరీక్షా కేంద్రం యొక్క గేట్లు మూసివేసిన తరువాత అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు A4 పరిమాణ కాగితంపై ముద్రించిన హాల్ టికెట్ను లేజర్ ప్రింటర్తో తీసుకురావాలని సూచించారు. కలర్ ప్రింట్ తీసుకుంటే మంచిదని అధికారులు తెలిపారు. పరీక్షకు రాకముందు ప్రింటెడ్ హాల్ టికెట్లో అందించిన స్థలంలో (3) మూడు నెలలకు ముందు తీసుకున్న పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించడం తప్పనిసరి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!