AIADMK: జయలలితపై మంత్రి అవమానకర వ్యాఖ్యలు.. అన్నాడీఎంకే మండిపాటు
- తమిళనాడు మంత్రి జయలలితపై అవమానకర వ్యాఖ్యలు చేసిన డీఎంకే మంత్రి అన్బరసన్
- ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ ఎఐఎడిఎంకె
- డీఎంకే కార్యక్రమంలో అన్బరసన్ ఈ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై మంత్రి టిఎం అన్బరసన్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎఐఎడిఎంకె (AIADMK) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన డీఎంకే కార్యక్రమంలో అన్బరసన్ మాట్లాడుతూ.. ఇటీవల రాజకీయ పార్టీని ప్రారంభించిన తమిళ నటుడు తలపతి విజయ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ సంఖ్యలో నటులకు అభిమానులు పెరుగుతున్నందునే.. పలువురు నటులు రాజకీయాల్లోకి వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నటులు రాజకీయాల్లోకి వచ్చి సాధించడం ఎంజీఆర్, జయలలితతోనే ముగిసిందని అన్నారు. జయలలితతో ఉన్న సంబంధం కారణంగానే అది కొనసాగిందని అన్బరసన్ తెలిపారు.
Read Also: NIRF: మరోసారి అగ్రగామిగా మద్రాస్ ఐఐటీ.. హైదరాబాద్ ఐఐటీ స్థానం ఎంతంటే?
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ఈ వ్యాఖ్యలను అన్నాడీఎంకే ఖండించింది. మహిళా విభాగం కార్యదర్శి వలర్మతి మాట్లాడుతూ.. అన్బరసన్ మాట్లాడేటప్పుడు నియంత్రణ కలిగి ఉండాలని అన్నారు. అతను బహిరంగ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. అతని వ్యాఖ్యలపై చాలా మంది, ముఖ్యంగా మహిళలు కలత చెందుతున్నారని ఆమె అన్నారు. అన్నాడీఎంకే నేత, రాష్ట్ర మాజీ మంత్రి జయకుమార్ కూడా అన్బరసన్ వ్యాఖ్యలను ఖండించారు. “మరణించిన వ్యక్తిపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు.. ఏ రాజకీయ నాయకుడు అంగీకరించడు” అని జయకుమార్ అన్నారు.. అన్బరసన్ ఇలానే మాట్లాడటం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
Read Also: Telusu Kada: సిద్ధూ కోసం థమన్.. రచ్చ లేపుడే
మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం కూడా స్పందించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, పెరుంతలైవర్ కమరాసర్, ముత్తరింజర్ రాజాజీ, విప్లవ నాయకుడు ఎంజీఆర్, విప్లవ నాయకురాలు జయలలిత వంటి ఎందరో రాజకీయ నేతలను అసాంఘికంగా తక్కువ చేసి మాట్లాడే అలవాటు ఉన్న పార్టీ డీఎంకే అని ఆరోపించారు. ఇది డీఎంకే సంస్కృతి.. ఈ సంస్కృతి అని తమిళనాడులోని మేధావి ప్రజలకు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!