Wayanad: 4రోజుల తర్వాత శిథిలాల నుంచి సురక్షితంగా నలుగురు..308కి చేరిన మరణాలు
- కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం ఘటన
- నాలుగు రోజులు గడిచినా ఇంకా సజీవంగా బయకు వస్తు్న్న బాధితులు
- ఈ రోజు శిథిలాల నుంచి నలుగురిని కాపాడిన ఆర్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా ఇంకా శిథిలాల నుంచి సజీవంగా ఉన్న వ్యక్తులు బయటకు వస్తున్నారు. వాయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత సైన్యం ఈ రోజు శిథిలాల నుంచి 4 మందిని సజీవంగా కనుగొన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వాయనాడ్లోని పడవెట్టి కున్ను ప్రాంతంలో శిథిలాల కింద కూరుకుపోయిన వీరిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసింది.
READ MORE: Vallabhaneni Vamsi Mohan: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
నలుగురిని కాపాడేందుకు అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ సమయంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ల్యాండ్ చేయబడింది. అయితే, రెస్క్యూలో రక్షించబడిన ఇద్దరు మహిళల్లో ఒకరికి కాలికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా..ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 308 మంది మరణించారు. అయితే.. రెస్క్యూలో పాల్గొన్న రెస్క్యూ వర్కర్లు ఇప్పటివరకు 195 మృతదేహాలను మాత్రమే కనుగొన్నారు. మిగిలిన వ్యక్తులవి కొన్ని శరీర భాగాలు మాత్రమే గుర్తించారు. 105 మంది మృతదేహాలలో కొన్ని భాగాలు మాత్రమే లభించాయి. ఆయా భాగాల ఆధారంగా వారి మరణం నిర్ధారించబడింది.
READ MORE:Chhattisgarh : కుక్క కాటుతో చనిపోయిన ఆవులు… వాటి పాలను విక్రయించిన యజమాని
40 బృందాలు సహాయక చర్యల్లో…
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు 40 రెస్క్యూ వర్కర్ల బృందాలు ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ను ప్రభావవంతంగా చేయడానికి, శోధన ప్రాంతాన్ని 6 వేర్వేరు భాగాలుగా విభజించడం గురించి చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతాలలో మొదటిది అట్టమల, అరన్మల. రెండవ ప్రాంతం ముండకై, మూడవ ప్రాంతం పుంజరిమట్టం, నాల్గవ ప్రాంతం వెల్లలార్మల గ్రామ రహదారి, ఐదవ ప్రాంతం జీవీహెచ్ఎస్ఎస్ వెల్లలార్మల. ఆరవది నది దిగువ ప్రాంతంగా విభజించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!