Adam Gilchrist: ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకో అంటూ.. టీమిండియా కెప్టెన్కు అవమానం
- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం.
- రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఘాటు వ్యాఖ్యలు.
- ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకో అంటూ సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adam Gilchrist: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన కెరీర్పై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచుల్లో ఆరు ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులే చేయగలిగాడు. ఈ కారణంగా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పాలని పలువురు మాజీ క్రికెటర్లు సైతం సూచించారు. తన చివరి 14 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలగడంతో, దేశవాళీ క్రికెట్ ఆడుతూ తన ఫామ్ను తిరిగి పొందాలని అనేక మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో గిల్క్రిస్ట్ ఓ పోడ్కాస్ట్లో హర్షా భోగ్లేతో కలిసి రోహిత్ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: RK Roja: తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి..
Also Read
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
ఇందులో భాగంగా గిల్క్రిస్ట్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంలో ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదని, ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాడని తెలిపాడు. తన కొడుకుతో సమయం గడిపి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలిపాడు. అలాగే రోహిత్ కొడుకు డైపర్లు మార్చుకోవడమే మిగిలిందని కాస్త ఎక్కువగానే మాట్లాడాడు.
అలాగే, రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు విరాట్ కోహ్లీ చేపడతారని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ సారథ్యం జట్టుకు మరింత బలం చేకూర్చుతుందని పేర్కొన్నాడు. బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా, గాయాలతో అర్ధాంతరంగా జట్టుకు దూరమయ్యాడని, చివరికి కోహ్లీ నాయకత్వాన్ని అందుకుని జట్టును నడిపించాడని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ లోకంలో చర్చనీయాంశంగా మారాయి. చూడాలి మరి రోహిత్ శర్మ భవిష్యత్తు టెస్ట్ ఫార్మాట్లో ఎలా ఉండబోతుందో.
తాజావార్తలు
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
-
Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?