CBI: బ్యాంకులో భారీ మోసం..మారువేషంలో 4 రాష్ట్రాల్లో 20 సంవత్సరాలు గడిపిన నిందితుడు
- బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా పరారీ
- ఆదివారం పట్టుకున్న సీబీఐ
- చనిపోయినట్లు ప్రకటించిన కోర్టు
- మే 2002లో బ్యాంకు నుంచి రూ. 50 లక్షలు మోసం
- మారువేషంలో 4 రాష్ట్రాల్లో 20 సంవత్సరాలు గడిపిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం పట్టుకుంది. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఆగస్టు 16 వరకు రిమాండ్కు పంపారు. నిందితుడు చనిపోయినట్లు కొన్నేళ్ల క్రితం ఇక్కడి కోర్టు ప్రకటించింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు వి.చలపతిరావు తన గుర్తింపును, ప్రదేశాన్ని పదే పదే మార్చుకున్నారని సీబీఐ సోమవారం తెలిపింది. అతను తన మొబైల్ నంబర్ను దాదాపు 10 సార్లు మార్చాడు. మే 2002లో బ్యాంకు నుంచి రూ. 50 లక్షలు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. రావు హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చందూలాల్ బిరాదారి బ్రాంచ్లో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తించేవాడు. ఈక్రమంలో మోసానికి పాల్పడ్డాడు.
READ MORE: Gyanvapi Case: జ్ఞాన్వాపిలో కొత్త ఆలయ నిర్మాణంపై నేడు కోర్టులో విచారణ..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
సీబీఐ 31 డిసెంబర్ 2004న రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. నిందితుడు 2004 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ కేసులో భార్య కూడా నిందితురాలు. రావు కనిపించకుండా పోయిన ఏడేళ్ల తర్వాత చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారు. అనంతరం అతడిని చనిపోయినట్లు ప్రకటించాలని కోర్టు ఆదేశించింది.
READ MORE:IND vs SL: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్డే.. సమం చేస్తారా? భారత తుది జట్టులో మార్పులు
నిందితుడు పదే పదే తన గుర్తింపును, స్థలాన్ని మార్చుకుంటున్నట్లు సీబీఐ తెలిపింది. 2007లో సేలంలో ఎం. వినీత్ కుమార్గా నటిస్తూ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. తన కొడుకుతో టచ్లో ఉన్నాడని రెండో భార్య ద్వారా సీబీఐకి తెలిసింది. అయితే 2014లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సేలం నుంచి బయలుదేరి భోపాల్కు చేరుకుని లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. దీని తర్వాత మళ్లీ ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్కు వెళ్లాడు. సీబీఐ బృందం రుద్రాపూర్కు చేరుకోగా.. అతడు 2016లో పరారీలో ఉన్నట్లు తేలింది. 2016లో ఔరంగాబాద్కి వెళ్లాడు. అక్కడ 2021 డిసెంబర్లో సుమారు రూ.70 లక్షల మోసానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రాజస్థాన్లోని భరత్పూర్కు వెళ్లి ఈ ఏడాది జూలై 8 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత తిరునెల్వేలి వెళ్లాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?