Abhishek Sharma: అభిషేక్ శర్మ చరిత్ర.. అప్పుడే విరాట్ కోహ్లీ క్లబ్లోకి గ్రాండ్ ఎంట్రీ!
- టీ20 ర్యాంకుల్లో అభిషేక్ శర్మ అరుదైన మైలురాయి
- మూడవ భారతీయ బ్యాట్స్మన్గా అభిషేక్ రికార్డు
- అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అప్పుడే ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అభిషేక్ 900లకు పైగా రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకుల్లో ఈ ఘనత అందుకున్న మూడవ భారతీయ బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల్లో అభిషేక్ నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఇదివరకు టీ20 ర్యాంకుల్లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే 900లకు పైగా రేటింగ్ పాయింట్లను సాధించారు. గతంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 912తో టీమిండియా తరపున అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 909 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. సూర్య, కోహ్లీలు సుదీర్ఘ కాలం భారత్ తరపున ఆడిన తర్వాత ఈ ఘనత సాధించగా.. అభిషేక్ శర్మ 21 మ్యాచ్లలోనే సాధించాడు. సూర్య, కోహ్లీల ఎలైట్ క్లబ్లోకి అభిషేక్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ మెరుపు బ్యాటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
Also Read: IND vs WI: పంత్, అయ్యర్ అవుట్.. అభిమన్యు సంగతేంటో?
2025 ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. 24 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పాకిస్థాన్పై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. దాంతో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ అయింది. 2012లో అహ్మదాబాద్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ పేరిట ఉంది. 23 బంటులోనే హఫీజ్ అర్ధ సెంచరీ బాదాడు.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!