IND vs WI: పంత్, అయ్యర్ అవుట్.. అభిమన్యు సంగతేంటో?
- యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025
- ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే టెస్టు సిరీస్
- అక్టోబర్ 2 నుంచి 6 వరకు మొదటి టెస్ట్
- బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. మంచి ఫామ్ మీదున్న భారత్ ఫైనల్ చేరడం ఖాయం. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే.. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి టెస్ట్, సెప్టెంబర్ 10-14 మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు భేటీ కానుంది. విండీస్తో టెస్టు సిరీస్కు భారత జట్టును ఈరోజు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా భేటీలో పాల్గొననున్నాడు.
ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కొనసాగనున్నారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా ఉంటారు. ఫార్మాట్కు దూరంగా ఉండాలకున్న శ్రేయస్ అయ్యర్కు చోటు లేనట్లే. రిషభ్ పంత్కు విశ్రాంతి కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ధ్రువ్ జురెల్ను ఎంపిక లాంఛనమే. నితీశ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ పక్కా. టెస్టు అరంగేట్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తోన్న అభిమన్యు ఈశ్వరన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్లు ఎంపిక కానున్నారు.
Also Read
- ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
స్పిన్ ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్లు జట్టులో చోటు దక్కించుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను తీసుకుంటే సుందర్ లేదా అక్షర్లలో ఒకరిపై వేటు పడుతుంది. పేస్ కోటాలో స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఎంపికవడం ఖాయం. మూడో పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి బీసీసీఐ సెలెక్టర్లు ఏదైనా షాకింగ్ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: ICC Rankings 2025: ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాళ్ల హవా.. మూడు విభాగాల్లోనూ టాపే!
భారత జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
తాజావార్తలు
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?