Team India: ఈ ముగ్గురు యువ ఆటగాళ్ళు మున్ముందు రికార్డులు నెలకొల్పుతారు..
- టీమిండియా ప్యూచర్ ఆటగాళ్లు ఎవరో చెప్పిన ఆకాశ్ చోప్రా
- ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చెప్పిన క్రికెట్ ఎక్స్పర్ట్
- ఆ ముగ్గురు ఆటగాళ్లు శుభ్మన్ గిల్.. యశస్వి జైస్వాల్.. రిషబ్ పంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ ఎక్స్పర్ట్ ఆకాష్ చోప్రా.. ఇటీవల టీమిండియా ప్యూచర్ ఆటగాళ్లు ఎవరో చెప్పారు. ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చెప్పారు. అందులో.. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఉన్నారు. పంత్ను యువరాజ్ సింగ్, సురేష్ రైనాగా కూడా అభివర్ణించాడు. 2022లో కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి వచ్చాడు. అతను మొదట టీ20 ప్రపంచ కప్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అతను శ్రీలంక పర్యటనలో వన్డేల్లో కూడా ఆడాడు. ఇప్పుడు అతనికి ఇష్టమైన ఫార్మాట్ టెస్ట్ క్రికెట్లో అతని పునరాగమనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ సందర్భంగా జరుగనుంది.
R. Ashwin: రిటైర్మెంట్పై టీమిండియా స్టార్ స్పిన్నర్ కీలక ప్రకటన..
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
రాజ్ షామ్నీ పోడ్కాస్ట్లో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. మొదట శుభ్మాన్ గిల్ గురించి, “అతను భవిష్యత్ సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు కలిగి ఉన్నాడు, శుభ్మాన్ గేమ్ పల్స్ని అర్థం చేసుకుంటాడు. చాలా సంవత్సరాలు ఆడిన చాలా మంది ఆటగాళ్ళు ఆట యొక్క పల్స్ను అర్థం చేసుకోలేరు, కానీ కొంతమంది ఆటగాళ్లు దానిని త్వరగా అర్థం చేసుకుంటారు. గొప్పవాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా ఆట పల్స్ను ముందుగానే అర్థం చేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ కూడా వన్డేల్లో బ్యాటింగ్ ప్రాముఖ్యతను త్వరగా అర్థం చేసుకున్నాడు. శుభమాన్ గిల్కి కూడా మంచి అవగాహన ఉంది.” అని అన్నాడు.
Delhi CM : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ?
యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుతూ, “అతను ఇప్పుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అతను చాలా కష్టపడుతున్నాడు.. అతని కష్టంతో అందరినీ ఓడించగలడు. అతను మూడు ఫార్మాట్లలో ఆడగల సత్తా ఉంది.” అని చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ, “పంత్కు భిన్నమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్తో ఎవరూ ఊహించని ప్రదర్శ చూపించగలడు.. నేను అతనిని మొదటిసారి చూసినప్పుడు, అతను వైట్ బాల్ క్రికెట్లో సురేష్ రైనా, యువరాజ్ సింగ్ల కలయిక అని అనుకున్నాను. అయితే టెస్టు క్రికెట్లో అతని ప్రత్యేకత బయటపడింది. అతను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో ఆడినప్పుడు సంచలనం సృష్టించాడు.” అని ఆకాష్ చోప్రా చెప్పారు.
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!