Aadi Srinivas: కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు.. వారి వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
- కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు
- ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
- కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సీబీఐకి కాళేశ్వరం అంశాన్ని అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం. ఎలాంటి పక్షపాతం లేకుండా సీబీఐకి అప్పగించడం అంటే పారదర్శకంగా ఉన్నామని సందేశం ఇవ్వడం. గతంలో సీబీఐకి అప్పగించాలని బీజేపీ సూచించింది. కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే మా మాట నిజం అయ్యింది. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయల దొరకడం అంటే ఏమిటి?. మాజీ మంత్రులు నిన్న హరీష్ రావు, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ సభ్యులు బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందో అందరూ చూశారు. బీజేపీ ఐడియాలజీని మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విమర్శిస్తుంది. ఈ రెండు పార్టీలు విరుద్ధ భావజాలం కలిగినవి.. ఎప్పుడూ కలవలేదు’ అని అన్నారు.
Also Read
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
‘గతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తామని చెప్పాం. కేంద్ర సంస్థగా ఉన్న సీబీఐకి అప్పగించాం. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థలకు ఇస్తే.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని ఆరోపిస్తారు. అందుకే కేంద్ర సంస్థకు అప్పగించడం జరిగింది. సీబీఐని గతంలో ఆయా అంశాలపై విమర్శించాం. కానీ కాళేశ్వరం అంశం ప్రత్యేక అంశంగా పరిగణించడం జరిగింది. మేము విమర్శలకు తావు లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాం. పారదర్శకంగా ఈ విచారణ జరగాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో అమిత్ షా, మోడీలు కూడా కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని కేసీఆర్ సంపాదించారని అన్నారు. కేసీఆర్ కుట్ర కోణంతో ఇదంతా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఈ కుంభకోణాన్ని వెలికి తీసేందుకు ఈ విచారణ జరుగుతుందని నమ్ముతున్నాం’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!