Aadi Srinivas: కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు.. వారి వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
- కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు
- ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
- కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సీబీఐకి కాళేశ్వరం అంశాన్ని అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం. ఎలాంటి పక్షపాతం లేకుండా సీబీఐకి అప్పగించడం అంటే పారదర్శకంగా ఉన్నామని సందేశం ఇవ్వడం. గతంలో సీబీఐకి అప్పగించాలని బీజేపీ సూచించింది. కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే మా మాట నిజం అయ్యింది. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయల దొరకడం అంటే ఏమిటి?. మాజీ మంత్రులు నిన్న హరీష్ రావు, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ సభ్యులు బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందో అందరూ చూశారు. బీజేపీ ఐడియాలజీని మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విమర్శిస్తుంది. ఈ రెండు పార్టీలు విరుద్ధ భావజాలం కలిగినవి.. ఎప్పుడూ కలవలేదు’ అని అన్నారు.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
‘గతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తామని చెప్పాం. కేంద్ర సంస్థగా ఉన్న సీబీఐకి అప్పగించాం. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థలకు ఇస్తే.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని ఆరోపిస్తారు. అందుకే కేంద్ర సంస్థకు అప్పగించడం జరిగింది. సీబీఐని గతంలో ఆయా అంశాలపై విమర్శించాం. కానీ కాళేశ్వరం అంశం ప్రత్యేక అంశంగా పరిగణించడం జరిగింది. మేము విమర్శలకు తావు లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాం. పారదర్శకంగా ఈ విచారణ జరగాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో అమిత్ షా, మోడీలు కూడా కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని కేసీఆర్ సంపాదించారని అన్నారు. కేసీఆర్ కుట్ర కోణంతో ఇదంతా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఈ కుంభకోణాన్ని వెలికి తీసేందుకు ఈ విచారణ జరుగుతుందని నమ్ముతున్నాం’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!