Aadi Srinivas: కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు.. వారి వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
- కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు
- ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
- కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సీబీఐకి కాళేశ్వరం అంశాన్ని అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం. ఎలాంటి పక్షపాతం లేకుండా సీబీఐకి అప్పగించడం అంటే పారదర్శకంగా ఉన్నామని సందేశం ఇవ్వడం. గతంలో సీబీఐకి అప్పగించాలని బీజేపీ సూచించింది. కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే మా మాట నిజం అయ్యింది. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయల దొరకడం అంటే ఏమిటి?. మాజీ మంత్రులు నిన్న హరీష్ రావు, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ సభ్యులు బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందో అందరూ చూశారు. బీజేపీ ఐడియాలజీని మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విమర్శిస్తుంది. ఈ రెండు పార్టీలు విరుద్ధ భావజాలం కలిగినవి.. ఎప్పుడూ కలవలేదు’ అని అన్నారు.
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
‘గతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తామని చెప్పాం. కేంద్ర సంస్థగా ఉన్న సీబీఐకి అప్పగించాం. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థలకు ఇస్తే.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని ఆరోపిస్తారు. అందుకే కేంద్ర సంస్థకు అప్పగించడం జరిగింది. సీబీఐని గతంలో ఆయా అంశాలపై విమర్శించాం. కానీ కాళేశ్వరం అంశం ప్రత్యేక అంశంగా పరిగణించడం జరిగింది. మేము విమర్శలకు తావు లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాం. పారదర్శకంగా ఈ విచారణ జరగాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో అమిత్ షా, మోడీలు కూడా కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని కేసీఆర్ సంపాదించారని అన్నారు. కేసీఆర్ కుట్ర కోణంతో ఇదంతా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఈ కుంభకోణాన్ని వెలికి తీసేందుకు ఈ విచారణ జరుగుతుందని నమ్ముతున్నాం’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!