Wolf Attack: ఆగని తోడేళ్ల బెడద.. తల్లి పక్కన పడుకున్న చిన్నారిపై దాడి
- యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం
- శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి
- తన తల్లి పక్కన పడుకున్న చిన్నారిపై దాడి
- చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నం
- చిన్నారి కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన తోడేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు. దీంతో.. తోడేలు పొలాల్లోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మళ్లీ తోడేలు హఠాత్తుగా దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Rain Alert: సెప్టెంబర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ..
Also Read
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
ఇంతకుముందు.. రెండు తోడేళ్ల కోసం 57 బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. తోడేళ్లను పట్టుకునేందుకు పీఏసీకి చెందిన 200, రెవెన్యూ శాఖకు చెందిన 32, అటవీశాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి. మహసీ తహసీల్లోని హార్ది, ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 50 గ్రామాలు తోడేళ్ల బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం, యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అవగాహన, నిర్బంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం కూడా తోడేళ్ల కోసం వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ తోడేళ్లను పట్టుకునేందుకు మూడు థర్మల్ డ్రోన్లు, నాలుగు బోనులు, అరడజన్ వలలు, ఆరు ట్రాపింగ్ కెమెరాలు అమర్చడం గమనార్హం.
Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..
మరోవైపు ఈ ప్రాంతంలో ఇద్దరు బాలికలు మిస్సింగ్ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి సమాచారం నేటికీ లభించలేదని కొందరు గ్రామస్థులు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ దేవేష్ శర్మకు తెలిపారు. అంతేకాకుండా.. ఆ ఇద్దరు బాలికల అదృశ్యమైన వ్యక్తులు ఎక్కడా నమోదు కాలేదనే అంశం కూడా లేవనెత్తారు. దీనిపై డాక్టర్ దేవేష్ శర్మ అధికారులతో సమావేశం నిర్వహించి సమాచారం సేకరించి విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!