Wolf Attack: ఆగని తోడేళ్ల బెడద.. తల్లి పక్కన పడుకున్న చిన్నారిపై దాడి
- యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం
- శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి
- తన తల్లి పక్కన పడుకున్న చిన్నారిపై దాడి
- చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నం
- చిన్నారి కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన తోడేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు. దీంతో.. తోడేలు పొలాల్లోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మళ్లీ తోడేలు హఠాత్తుగా దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Rain Alert: సెప్టెంబర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ..
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
ఇంతకుముందు.. రెండు తోడేళ్ల కోసం 57 బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. తోడేళ్లను పట్టుకునేందుకు పీఏసీకి చెందిన 200, రెవెన్యూ శాఖకు చెందిన 32, అటవీశాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి. మహసీ తహసీల్లోని హార్ది, ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 50 గ్రామాలు తోడేళ్ల బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం, యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అవగాహన, నిర్బంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం కూడా తోడేళ్ల కోసం వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ తోడేళ్లను పట్టుకునేందుకు మూడు థర్మల్ డ్రోన్లు, నాలుగు బోనులు, అరడజన్ వలలు, ఆరు ట్రాపింగ్ కెమెరాలు అమర్చడం గమనార్హం.
Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..
మరోవైపు ఈ ప్రాంతంలో ఇద్దరు బాలికలు మిస్సింగ్ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి సమాచారం నేటికీ లభించలేదని కొందరు గ్రామస్థులు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ దేవేష్ శర్మకు తెలిపారు. అంతేకాకుండా.. ఆ ఇద్దరు బాలికల అదృశ్యమైన వ్యక్తులు ఎక్కడా నమోదు కాలేదనే అంశం కూడా లేవనెత్తారు. దీనిపై డాక్టర్ దేవేష్ శర్మ అధికారులతో సమావేశం నిర్వహించి సమాచారం సేకరించి విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!