UP: ప్రియుడి కోసం భర్తకు ఇచ్చిన కాఫీలో విషం కలిపిన భార్య.. చివరికి ఏమైందంటే?
- ముజఫర్ నగర్ మరో హృదయ విదారక ఘటన
- రెండేళ్ల క్రితమే వివాహం
- ప్రియుడితో గంటల తరబడి మాట్లాడుతున్న భార్య
- నచ్చజెప్పడానికి ప్రయత్నించిన భర్త
- భర్తలే లేపేయడానికి భార్య ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ముస్కాన్ కేసు ఇంకా చల్లార లేదు. తాజాగా ముజఫర్ నగర్ నుంచి మరో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండేళ్ల క్రితమే వివాహమైన పింకీ అనే మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. కాఫీలో విషం కలిపి భర్తను చంపడానికి ఆమె కుట్ర పన్నింది. ఈ సంచలనాత్మక కేసులో బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
Also Read
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
ముజఫర్నగర్ జిల్లా ఖతౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భయాంగి గ్రామానికి చెందిన 26 ఏళ్ల అనుజ్ శర్మ, రెండేళ్ల క్రితం ఘజియాబాద్లోని లోని పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన పింకీ శర్మ అలియాస్ సన్నోను వివాహం చేసుకున్నాడు. అనుజ్ మీరట్లోని ఒక ఆసుపత్రిలో పనిచేసేవాడు. పెళ్లైన కొన్ని నెలలకే పింకీ, అనుజ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. పింకీ వేరొకరితో మాట్లాడుతోందని అనుజ్ అనుమానించాడు. అనుజ్ పింకీకి నచ్చజెప్పడానికి చాలా సార్లు ప్రయత్నించాడు. మార్చి 25 సాయంత్రం పింకీ అనుజ్ కాఫీలో విషం కలిపి చంపడానికి ప్రయత్నించింది. కాఫీ తాగిన తర్వాత అనుజ్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం బాధితుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
READ MORE:Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
ఈ అంశంపై అనుజ్ సోదరి మీనాక్షి మాట్లాడుతూ.. “నా తమ్ముడు పనికి వెళ్ళినప్పుడు.. పింకీ తన ప్రియుడితో గంటల తరబడి మొబైల్లో మాట్లాడేది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారింది. ఇటీవల.. అనుజ్ దాడి చేసినట్లు పింకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒకరోజు అనుజ్ పింకీ మొబైల్ లాక్కుని తన ప్రియుడి సందేశాలు, ఫోటోలను చూశాడు. ఆ ప్రేమికుడు మరెవరో కాదు, పింకీ బంధువు. నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. అనంతరం మార్చి 25 సాయంత్రం.. పింకీ అనుజ్ కాఫీలో విషం కలిపి చంపడానికి ప్రయత్నించింది. కాఫీ తాగిన తర్వాత అనుజ్ ఆరోగ్యం క్షీణించింది. అతన్ని మీరట్ ఆసుపత్రిలో చేర్చాం. వైద్యులు అతన్ని ఐసీయులో ఉంచారు. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.” అని మీనాక్షి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఓ ఖతౌలి రామశిష్ యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
-
Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
-
TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
-
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!