Shocking: అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చ పెడుతున్నాయి. ముఖ్యంగా, పెళ్లి అనంతరం వేరే వ్యక్తుల మోజులో పడిన మహిళలు భర్త, పిల్లల్ని వదిలేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఏటావా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ తన భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలేసి, ఇన్స్టాగ్రామ్ లవర్తో లేచిపోయింది. తన లవర్లో జీవించాలని అనుకుంటున్నానని కోర్టులో చెప్పింది. తన భర్త తాగుబోతు, జూదగాడు అని ఆరోపించింది.
Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు...!! భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు !! భర్త వదిలేస్తేనేం నీకు నేనున్నాంటూ చేరదీశాడు. కానీ.. ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచించాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై.. ఇటు ప్రియుడూ వదిలేసి.. ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేది లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి.
పరాయి వ్యక్తులపై మోజు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల బంధానికి బీటలుపారేలా చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రియుడి సాయంతో భర్తలను చంపేస్తున్నారు కొందరు భార్యలు. కొన్ని రోజుల క్రితం ఓ భార్య తన భర్తను సెల్ఫీ తీసుకుందామని చెప్పి నదిలోకి తోసేసిన విషయం తెలిసిందే. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపింది. అయితే ఈ కేసులో బిగ్…
Shcoking Incident : మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతున్న సమాజంలో, భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్ర రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది…
Suicide : హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఓ మహిళ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం (14-06-2025) ఉదయం 8:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు కొక్కినీ శ్రావణి (30), ఆమె తిమ్మాపురం, ఏలూరు జిల్లా వాసి. కొద్ది నెలల క్రితమే హైదరాబాద్కు వలసవచ్చి, జనప్రియ…
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ముస్కాన్ కేసు ఇంకా చల్లార లేదు. తాజాగా ముజఫర్ నగర్ నుంచి మరో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండేళ్ల క్రితమే వివాహమైన పింకీ అనే మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. కాఫీలో విషం కలిపి భర్తను చంపడానికి ఆమె కుట్ర పన్నింది. ఈ సంచలనాత్మక కేసులో బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో విషాదం చోటుచేసుకుంది. తల్లి ముగ్గురు చిన్నారులను అన్నంలో విషం కలిపి తినిపించింది. తాను ఆహారం ద్వారా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియా (10), గౌతమ్ (8) మృతిచెందారు. తల్లి రజిత తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బేతవోలులో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 12ఏళ్ల చిన్నారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలియరాని కారణాలతో బాలుడు సాయి హర్ష ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లి ఉద్యోగ విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.